ETV Bharat / state

'పోలింగ్​ నిర్వహణలో ప్రిసైడింగ్​ అధికారులదే కీలకపాత్ర' - hyderabad civic polls

గ్రేటర్​ ఎన్నికల నిర్వహణ కోసం సిద్దిపేట జిల్లా కేటాయించిన సిబ్బందికి అధికారులు శిక్షణ ఇచ్చారు. వివిధ శాఖలకు 435మందిని పీవోలు, ఏపీవోలుగా నియమించినట్లు సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్​ పద్మాకర్​ తెలిపారు.

ghmc-election-training-for-presiding-officers-in-siddipet-district
'పోలింగ్​ నిర్వహణలో ప్రిసైడింగ్​ అధికారులదే కీలకపాత్ర'
author img

By

Published : Nov 27, 2020, 7:21 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ కోసం సిద్దిపేట జిల్లా నుంచి కేటాయించిన సిబ్బందికి సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఇచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. వివిధ శాఖలకు చెందిన 435మందిని పీవోలు, ఏపీవోలుగా నియమించినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులది కీలక పాత్ర అని.. నిబంధన ప్రకారం ఎన్నికలు జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ పీవోలు, ఏపీవోలకు సూచించారు.

ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరుకావాలని.. గైర్హాజరైన వాళ్లపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సిబ్బంది నవంబర్ 30న కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకొని.. మెటీరియల్​ను తీసుకొని పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. డిసెంబర్ 1న ఉదయం 7.00 గంటలకు పోలింగ్​ను ప్రారంభించాలన్నారు.

'పోలింగ్​ నిర్వహణలో ప్రిసైడింగ్​ అధికారులదే కీలకపాత్ర'

ఇవీ చూడండి: ప్రజాప్రతినిధులను ఏజెంట్లుగా అనుమతించొద్దు: లోకేష్​ కుమార్​

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ కోసం సిద్దిపేట జిల్లా నుంచి కేటాయించిన సిబ్బందికి సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఇచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. వివిధ శాఖలకు చెందిన 435మందిని పీవోలు, ఏపీవోలుగా నియమించినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులది కీలక పాత్ర అని.. నిబంధన ప్రకారం ఎన్నికలు జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ పీవోలు, ఏపీవోలకు సూచించారు.

ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరుకావాలని.. గైర్హాజరైన వాళ్లపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సిబ్బంది నవంబర్ 30న కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకొని.. మెటీరియల్​ను తీసుకొని పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. డిసెంబర్ 1న ఉదయం 7.00 గంటలకు పోలింగ్​ను ప్రారంభించాలన్నారు.

'పోలింగ్​ నిర్వహణలో ప్రిసైడింగ్​ అధికారులదే కీలకపాత్ర'

ఇవీ చూడండి: ప్రజాప్రతినిధులను ఏజెంట్లుగా అనుమతించొద్దు: లోకేష్​ కుమార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.