ETV Bharat / state

మంత్రి తలసాని వ్యాఖ్యలను ఖండించిన గంగ పుత్రులు - siddipet district latest news

చెరువులపై ముదిరాజులకు హక్కు ఉందంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సిద్దిపేట జిల్లాలో గంగ పుత్రులు ఆందోళన చేపట్టారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. తలసాని తన మాటలు వెనక్కి తీసుకుని... బెస్త కులస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ganga putras condemned the remarks made by minister Srinivas Yadav
మంత్రి తలసాని వ్యాఖ్యలను ఖండించిన గంగ పుత్రులు
author img

By

Published : Jan 15, 2021, 12:58 PM IST

చెరువులపై ముదిరాజులకు హక్కు ఉందంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సిద్దిపేట జిల్లాలో గంగ పుత్రులు ఆందోళన చేపట్టారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాఘవపూర్ గ్రామ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. వెంటనే మంత్రి పదవి నుంచి తలసానిని తొలగించాలని గంగపుత్ర సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

ముదిరాజు కులస్తులకు చేపలు పట్టే హక్కు కల్పించ వద్దని కోరారు. సంప్రదాయ మత్స్యకారులైన గంగపుత్రులను అవమానపరిచిన తలసాని తన మాటలు వెనక్కి తీసుకుని... బెస్త కులస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.

చెరువులపై ముదిరాజులకు హక్కు ఉందంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సిద్దిపేట జిల్లాలో గంగ పుత్రులు ఆందోళన చేపట్టారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాఘవపూర్ గ్రామ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. వెంటనే మంత్రి పదవి నుంచి తలసానిని తొలగించాలని గంగపుత్ర సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

ముదిరాజు కులస్తులకు చేపలు పట్టే హక్కు కల్పించ వద్దని కోరారు. సంప్రదాయ మత్స్యకారులైన గంగపుత్రులను అవమానపరిచిన తలసాని తన మాటలు వెనక్కి తీసుకుని... బెస్త కులస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.

ఇదీ చదవండి: సాగు చట్టాలపై వెనక్కి తగ్గని రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.