ETV Bharat / state

దుబ్బాక ఎమ్మెల్యే ఉప ఎన్నిక పోటీలో కలియుగ పాండవులు

దుబ్బాక నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడానికి కలియుగ పాండవులు బయలుదేరారు. కలియుగ పాండవులు ఏంటీ అని అనుకుంటున్నారా.! అవును.. ప్రజల సమస్యలు తీర్చడానికి వారు అలా అవతారమెత్తారు. ఇదివరకు వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవంతో దుబ్బాకలో గెలిచేందుకు సిద్ధమయ్యారు. మీ కళ్లకు కట్టుకున్న నల్ల గంతలను తొలగించండని కోరుతున్నారు.

author img

By

Published : Oct 9, 2020, 7:55 PM IST

దుబ్బాక ఎమ్మెల్యే ఉప ఎన్నిక పోటీలో కలియుగ పాండవులు
దుబ్బాక ఎమ్మెల్యే ఉప ఎన్నిక పోటీలో కలియుగ పాండవులు

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం కలియుగ పాండవులు నామ పత్రాలు సమర్పించారు. వీరు వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈసారి వీరంతా కలిసి కలియుగ పాండవులుగా దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే ఉప ఎన్నికకు నామినేషన్​ వేశారు. ఇందులో బుర్ర రవితేజ గౌడ్​ వేములవాడ, రాజు ఉప్పల్​, కోట శ్యామ్​ కుమార్​ కరీంనగర్​, మోతే నరేశ్​ ధర్మపురి, మీసాల రాజ్య సాగర చొప్పదండి నియోజకవర్గానికి చెందినవారు.

ప్రజల సమస్యల పట్ల బాధ్యత వహించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వీరు కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్​ వేయాలని డిమాండ్​ చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలన్నారు. దుబ్బాక ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని.. యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు. మీ కళ్లకు కట్టుకున్న నల్ల గంతలు తొలగించి.. సమస్యల పరిష్కారానికి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం కలియుగ పాండవులు నామ పత్రాలు సమర్పించారు. వీరు వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈసారి వీరంతా కలిసి కలియుగ పాండవులుగా దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే ఉప ఎన్నికకు నామినేషన్​ వేశారు. ఇందులో బుర్ర రవితేజ గౌడ్​ వేములవాడ, రాజు ఉప్పల్​, కోట శ్యామ్​ కుమార్​ కరీంనగర్​, మోతే నరేశ్​ ధర్మపురి, మీసాల రాజ్య సాగర చొప్పదండి నియోజకవర్గానికి చెందినవారు.

ప్రజల సమస్యల పట్ల బాధ్యత వహించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వీరు కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్​ వేయాలని డిమాండ్​ చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలన్నారు. దుబ్బాక ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని.. యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు. మీ కళ్లకు కట్టుకున్న నల్ల గంతలు తొలగించి.. సమస్యల పరిష్కారానికి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్​ను చూసి తెరాస భయపడుతోంది: పొన్నం ప్రభాకర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.