ETV Bharat / state

రాష్ట్రంలో 109 అర్బన్​ పార్కులు ఏర్పాటుచేస్తాం: హరీశ్​రావు

author img

By

Published : Jan 28, 2021, 4:18 PM IST

Updated : Jan 28, 2021, 10:55 PM IST

సిద్ధిపేట జిల్లా నాగులబండలో అర్బన్​ పార్కును మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 109 అర్బన్​ పార్కులు ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.

harish rao
రాష్ట్రంలో 109 అర్బన్​ పార్కులు ఏర్పాటుచేస్తాం: హరీశ్​రావు

దేశంలో అడవులు పునరుజ్జీవ కార్యక్రమం తొలిసారిగా తెలంగాణలోనే చేపట్టినట్లు మంత్రి హరీశ్​రావు తెలిపారు. సిద్ధిపేట శివారులో నాగులబండ వద్ద రూ.4.3 కోట్లతో ఏర్పాటుచేసిన అర్బన్​ పార్కును ఆయన ప్రారంభించారు. సుమారు ఐదు వందల ఎకరాల్లో పార్కును ఏర్పాటుచేయగా.. 50 ఎకరాలు ఆక్సిజన్​ పార్కుకు కేటాయించినట్లు చెప్పారు.

రాష్ట్రంలో 109 అర్బన్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు హరీశ్​రావు. సిద్ధిపేట పార్కుతో కలిసి.. 35 పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్​ అందించాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

నాగులబండ అర్బన్​ పార్కులో రెండు నెలల్లో మూషిక జింకలు వదులుతామని హరీశ్​ తెలిపారు. సాహస క్రీడలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పిల్లలు ఆడుకునేందుకు వసతులు కల్పించామన్నారు.

పట్టణాలు, గ్రామాల్లో ప్రకృతి వనాల ఏర్పాటుకు పదిశాతం బడ్జెట్​ కేటాయించినట్లు మంత్రి హరీశ్​ గుర్తుచేశారు.

రాష్ట్రంలో 109 అర్బన్​ పార్కులు ఏర్పాటుచేస్తాం: హరీశ్​రావు

ఇవీచూడండి: 'వంటిమామిడి నుంచి కూరగాయలు సరఫరా చేయొచ్చా?'

దేశంలో అడవులు పునరుజ్జీవ కార్యక్రమం తొలిసారిగా తెలంగాణలోనే చేపట్టినట్లు మంత్రి హరీశ్​రావు తెలిపారు. సిద్ధిపేట శివారులో నాగులబండ వద్ద రూ.4.3 కోట్లతో ఏర్పాటుచేసిన అర్బన్​ పార్కును ఆయన ప్రారంభించారు. సుమారు ఐదు వందల ఎకరాల్లో పార్కును ఏర్పాటుచేయగా.. 50 ఎకరాలు ఆక్సిజన్​ పార్కుకు కేటాయించినట్లు చెప్పారు.

రాష్ట్రంలో 109 అర్బన్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు హరీశ్​రావు. సిద్ధిపేట పార్కుతో కలిసి.. 35 పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్​ అందించాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

నాగులబండ అర్బన్​ పార్కులో రెండు నెలల్లో మూషిక జింకలు వదులుతామని హరీశ్​ తెలిపారు. సాహస క్రీడలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పిల్లలు ఆడుకునేందుకు వసతులు కల్పించామన్నారు.

పట్టణాలు, గ్రామాల్లో ప్రకృతి వనాల ఏర్పాటుకు పదిశాతం బడ్జెట్​ కేటాయించినట్లు మంత్రి హరీశ్​ గుర్తుచేశారు.

రాష్ట్రంలో 109 అర్బన్​ పార్కులు ఏర్పాటుచేస్తాం: హరీశ్​రావు

ఇవీచూడండి: 'వంటిమామిడి నుంచి కూరగాయలు సరఫరా చేయొచ్చా?'

Last Updated : Jan 28, 2021, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.