ETV Bharat / state

ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు

author img

By

Published : Dec 8, 2019, 6:48 PM IST

గజ్వేల్ పట్టణంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, జేసీ పద్మాకర్.... అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

fdc chairmen prateep reddy review meeting  revienue and police officers
ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో ఈనెల 11న ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. సీఎం చేతుల మీదుగా పలు ప్రగతి పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక సమీకృత కార్యాలయ భవనంలో ఎఫ్​డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జేసీ పద్మాకర్​లు నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్​ అధికారులతో సమీక్షించారు.

ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోపాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులను జారీ చేయాలని సూచించారు. మహతి ఆడిటోరియంలో సీఎం... ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నందున సమావేశానికి వచ్చేవారికి ముందస్తు పాసులు జారీ చేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

ఇదీ చూడండి: మిషన్​ భగీరథ లీకేజీ... రోడ్డుపైకి చిమ్ముతున్న నీరు

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో ఈనెల 11న ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. సీఎం చేతుల మీదుగా పలు ప్రగతి పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక సమీకృత కార్యాలయ భవనంలో ఎఫ్​డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జేసీ పద్మాకర్​లు నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్​ అధికారులతో సమీక్షించారు.

ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోపాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులను జారీ చేయాలని సూచించారు. మహతి ఆడిటోరియంలో సీఎం... ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నందున సమావేశానికి వచ్చేవారికి ముందస్తు పాసులు జారీ చేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

ఇదీ చూడండి: మిషన్​ భగీరథ లీకేజీ... రోడ్డుపైకి చిమ్ముతున్న నీరు

Intro:tg_srd_16_08_cm_paryatana_erpatlu_samiksha_av_ts10054
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి జెసి పద్మాకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు


Body:సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రగతి పనులను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 11న రానుండడంతో ప్రారంభోత్సవ ఏర్పాట్లను అధికారులు శరవేగంగా చేస్తున్నారు ఇందులో భాగంగా స్థానిక సమీకృత కార్యాలయ భవనం లో ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జెసి పద్మాకర్ లు నియోజకవర్గంలోని తహసిల్దార్లు ఎంపీడీవోలు పోలీస్ శాఖ తో పాటు ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సీఎం పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచనలు చేశారు పోలీసు శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ముందస్తుగానే ఫోటోలతో కూడిన గుర్తింపు కార్డులను జారీ చేయాలన్నారు మహతి ఆడిటోరియం లో సీఎం ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉండడంతో అందులో కి హాజరయ్యే వారికి ముందస్తు పాసులను జారీ చేయాలన్నారు పార్టీ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు అధికారులు పోలీసు సిబ్బందికి సహకరించాలని సూచించారు


Conclusion:గజ్వేల్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.