ETV Bharat / state

LAND GRAB: కోట్ల విలువైన ప్రభుత్వ భూములు.. ఆక్రమణలతో అన్యాక్రాంతం

పక్కనేబాహ్య వలయరహదారి, చుట్టూ ఆకాశ హర్మాలు, సమీపంలో సాఫ్ట్​వేర్, ఆర్థిక రంగాలకు చెందిన బహుళజాతి సంస్థలు. అంతటి విలువైన ప్రదేశంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు అక్రమణదారులకు వంతపాడుతున్నారు. కోట్ల విలువైన భూమిలో ఆక్రమణలు తొలగించాల్సిన అధికారులే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయ్యోలా వ్యవహరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు శివారులో జరిగిన భూఆక్రమణలపై కథనం.

author img

By

Published : Aug 6, 2021, 5:06 AM IST

LAND GRAB
కోట్ల విలువైన భూమిలో ఆక్రమణలు

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పురపాలిక పరిధిలోని కొల్లూర్‌లో.. భూ అక్రమాలకు తెరపడటం లేదు. అక్రమణదారుల నుంచి తాయిలాలు అందుకొని కొందరు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కొల్లూరు శివారులోని సర్వే నెంబర్‌ 191లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఆక్రమణదారులు హద్దురాళ్లు తొలగించారు. వాటిని యథాస్థానంలో పెట్టాల్సిన అధికారులు.. మరో చోటకు మార్చి కబ్జాదారులకు సాయంచేశారు.

కోట్ల విలువైన భూమిలో ఆక్రమణలు

191 సర్వే నెంబర్‌ పక్కనే ఉన్న 205, 209 సర్వే నెంబర్లలో ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన భూమి ఉంది. ప్రభుత్వ, పట్టాభూమికి మధ్యలో బండ్ల బాట ఉండేదని.. సమీపంలోని పెద్దమ్మ గుడి వద్ద పంటలకోత సమయంలో పూజలు చేసే వాళ్లమని స్థానిక రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గోడకట్టడంతో గుడికి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో సంతృప్తి చెందని భూఆక్రమణదారుడు పట్టాలో ఉన్నమొత్తం కంటే విస్తీర్ణం తక్కువగా ఉందని.. తన భూమి హద్దులు చూపించాలంటూ.. సంగారెడ్డి జిల్లా సర్వేల్యాండ్ రికార్డ్స్ అదనపు సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ విషయంపై సర్వేచేసిన అధికారులు.. ప్రభుత్వ భూమిని కలిపి ఆక్రమణదారుడికి మద్దతుగా హద్దు రాళ్లు పాతినట్లు గుర్తించారు.

వెంకటేశం కొల్లూరు వాసి

పట్టాదారుడు చేసిన ఫిర్యాదు ఆధారంగానే సర్వే చేశామని రామచంద్రాపురం తహసీల్దార్‌ శివకుమార్‌ తెలిపారు. తాజాగా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు హద్దు రాళ్లు మార్చి ప్రభుత్వ భూమిలో పాతిన విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆ విషయంపై ఉన్నతాధికారులు లేఖరాసినట్లు స్పష్టంచేశారు.

సరిహద్దు రాళ్లు తొలగింపు, మరో చోట పాతే అధికారం ఎవరికీ లేదని సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ మధుసూదన్ రావు చెబుతున్నారు. భూముల సర్వేకు అవే ప్రామాణికమని క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలు నిగ్గు తేలుస్తానని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించడంతో పాటు అక్రమార్కులకు అండగా ఉన్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

GRMB: జీఆర్ఎంబీ బోర్డు సమావేశానికి హాజరుకావటం లేదు: తెలంగాణ

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పురపాలిక పరిధిలోని కొల్లూర్‌లో.. భూ అక్రమాలకు తెరపడటం లేదు. అక్రమణదారుల నుంచి తాయిలాలు అందుకొని కొందరు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కొల్లూరు శివారులోని సర్వే నెంబర్‌ 191లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఆక్రమణదారులు హద్దురాళ్లు తొలగించారు. వాటిని యథాస్థానంలో పెట్టాల్సిన అధికారులు.. మరో చోటకు మార్చి కబ్జాదారులకు సాయంచేశారు.

కోట్ల విలువైన భూమిలో ఆక్రమణలు

191 సర్వే నెంబర్‌ పక్కనే ఉన్న 205, 209 సర్వే నెంబర్లలో ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన భూమి ఉంది. ప్రభుత్వ, పట్టాభూమికి మధ్యలో బండ్ల బాట ఉండేదని.. సమీపంలోని పెద్దమ్మ గుడి వద్ద పంటలకోత సమయంలో పూజలు చేసే వాళ్లమని స్థానిక రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గోడకట్టడంతో గుడికి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో సంతృప్తి చెందని భూఆక్రమణదారుడు పట్టాలో ఉన్నమొత్తం కంటే విస్తీర్ణం తక్కువగా ఉందని.. తన భూమి హద్దులు చూపించాలంటూ.. సంగారెడ్డి జిల్లా సర్వేల్యాండ్ రికార్డ్స్ అదనపు సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ విషయంపై సర్వేచేసిన అధికారులు.. ప్రభుత్వ భూమిని కలిపి ఆక్రమణదారుడికి మద్దతుగా హద్దు రాళ్లు పాతినట్లు గుర్తించారు.

వెంకటేశం కొల్లూరు వాసి

పట్టాదారుడు చేసిన ఫిర్యాదు ఆధారంగానే సర్వే చేశామని రామచంద్రాపురం తహసీల్దార్‌ శివకుమార్‌ తెలిపారు. తాజాగా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు హద్దు రాళ్లు మార్చి ప్రభుత్వ భూమిలో పాతిన విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆ విషయంపై ఉన్నతాధికారులు లేఖరాసినట్లు స్పష్టంచేశారు.

సరిహద్దు రాళ్లు తొలగింపు, మరో చోట పాతే అధికారం ఎవరికీ లేదని సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ మధుసూదన్ రావు చెబుతున్నారు. భూముల సర్వేకు అవే ప్రామాణికమని క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలు నిగ్గు తేలుస్తానని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించడంతో పాటు అక్రమార్కులకు అండగా ఉన్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

GRMB: జీఆర్ఎంబీ బోర్డు సమావేశానికి హాజరుకావటం లేదు: తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.