ETV Bharat / state

హుస్నాబాద్​లో కాంగ్రెస్ వినూత్న నిరసన

author img

By

Published : Jul 7, 2020, 4:22 PM IST

హుస్నాబాద్​లో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని.. వినూత్నంగా నిరసన చేపట్టింది.

congress leaders protest at husnabad roads in siddipeta
రహదారులకు మరమ్మతులు చేయాలంటూ కాంగ్రెస్​ నేతల నిరసన

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ప్రధాన రహదారుల్లో ఏర్పడిన ప్రమాదకర గుంతలను పూడ్చాలని కాంగ్రెస్ వినూత్న నిరసనకు దిగింది. గుంతల్లో తెరాస జెండాలు పాతారు. అసలే నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ రద్దీగా ఉండే హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గుంతలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు హుస్నాబాద్ అభివృద్ధిపై దృష్టి సారించి సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చాలని కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్​ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ కోరారు. తెరాస పార్టీ జెండాలను పాతినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ప్రధాన రహదారుల్లో ఏర్పడిన ప్రమాదకర గుంతలను పూడ్చాలని కాంగ్రెస్ వినూత్న నిరసనకు దిగింది. గుంతల్లో తెరాస జెండాలు పాతారు. అసలే నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ రద్దీగా ఉండే హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గుంతలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు హుస్నాబాద్ అభివృద్ధిపై దృష్టి సారించి సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చాలని కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్​ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ కోరారు. తెరాస పార్టీ జెండాలను పాతినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి: చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.