సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకి కాలువ ద్వారా గోదావరి జలాలు రావడం వల్ల ఆ ప్రాంతమంతా జలకళ సంతరించుకుంది. నీరు రావడానికి కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటాలకు కౌన్సిలర్లు గోదావరి జలాలతో అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, వార్డు కౌన్సిలర్లు గోనెపల్లి దేవలక్ష్మి, మట్టా మల్లారెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ గన్నే వనిత పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!