ETV Bharat / state

'హుస్నాబాద్ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు అందించాలి' - హుస్నాబాద్ ఆసుపత్రిలో భాజపా నాయకుల ఆందోళన

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. హుస్నాబాద్ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ లో చేర్చాలని డిమాండ్ చేశారు.

bjp leaders protest at husnabad
'హుస్నాబాద్ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు అందించాలి'
author img

By

Published : Jul 16, 2020, 5:09 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రి ఎదుట భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిని వైద్య విధాన పరిషత్‌లో చేర్చాలని, ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 50 పడకలతో నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన చికిత్స అందించట్లేదని ఆరోపించారు.

హుస్నాబాద్ ఆసుపత్రికి చుట్టుపక్కల 100 గ్రామాల నుంచి ప్రజలు వస్తారని.. ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు లేక, ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పందించి హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిని వైద్య విధాన పరిషత్‌లో చేర్చేలా కృషి చేయాలని, సరిపడా వైద్యులను నియమించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రి ఎదుట భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిని వైద్య విధాన పరిషత్‌లో చేర్చాలని, ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 50 పడకలతో నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన చికిత్స అందించట్లేదని ఆరోపించారు.

హుస్నాబాద్ ఆసుపత్రికి చుట్టుపక్కల 100 గ్రామాల నుంచి ప్రజలు వస్తారని.. ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు లేక, ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పందించి హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిని వైద్య విధాన పరిషత్‌లో చేర్చేలా కృషి చేయాలని, సరిపడా వైద్యులను నియమించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.