ETV Bharat / state

దుబ్బాకలో గెలుపు కోసం.. భాజపా ముమ్మర ప్రచారం

author img

By

Published : Oct 3, 2020, 8:42 PM IST

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా ముమ్మర ప్రచారం చేస్తోంది. పార్టీ నుంచి టికెట్​ ఆశిస్తున్న రఘునందన్​ రావు దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించి భాజపాను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తెరాస పాలనలో దుబ్బాకలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.

BJP  Campaign In Dubbaka by elections
దుబ్బాకలో గెలుపు కోసం.. భాజపా ముమ్మర ప్రచారం

దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా గెలుపు కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా దుబ్బాకలో పాగా వేయాలని ఎత్తులు వేస్తున్నది. ఆ స్థానం నుంచి టికెట్​ ఆశిస్తున్న రఘునందన్​ రావు ఇప్పటికే.. ప్రచారం ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని రాయపోల్​ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి ఉప ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఆరేళ్ల తెరాస పాలనలో నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటో ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయాాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబ్బాక అభివృద్ధిని పట్టించుకోని మంత్రి హరీష్​రావు ఎన్నికల్లో ఓట్ల కోసం ఈ ప్రాంత ప్రజల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం తానే ఇస్తున్నట్టు ప్రచారం చేస్తుందని, తెరాస నేతలు అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని రఘునందన్​రావు విమర్శించారు. పేదల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని.. ఎన్నికల్లో భాజపా గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా గెలుపు కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా దుబ్బాకలో పాగా వేయాలని ఎత్తులు వేస్తున్నది. ఆ స్థానం నుంచి టికెట్​ ఆశిస్తున్న రఘునందన్​ రావు ఇప్పటికే.. ప్రచారం ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని రాయపోల్​ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి ఉప ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఆరేళ్ల తెరాస పాలనలో నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటో ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయాాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబ్బాక అభివృద్ధిని పట్టించుకోని మంత్రి హరీష్​రావు ఎన్నికల్లో ఓట్ల కోసం ఈ ప్రాంత ప్రజల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం తానే ఇస్తున్నట్టు ప్రచారం చేస్తుందని, తెరాస నేతలు అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని రఘునందన్​రావు విమర్శించారు. పేదల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని.. ఎన్నికల్లో భాజపా గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి: యూపీలో మైనర్​ అపహరణ, సామూహిక అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.