సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో రెండో రోజు 34 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 13వ వార్డు అభ్యర్థిగా ఇస్తారుగల్ల కవిత, 14వ వార్డుకు ఇస్తారుగల్ల చరణ్ తేజ, 10వ వార్డుకు ఎండీ సలీం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే దుబ్బాక అభివృద్ధి జరిగినందున మరోసారి అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
- ఇవీ చూడండి: యావత్ దేశానికే ఆదర్శంగా మున్సిపాలిటీ చట్టం