దేశవ్యాప్త లాక్డౌన్ పొడిగింపు వల్ల రాష్ట్రంలో మద్యం దుకాణాల మూసివేత గడువును ఆబ్కారీ శాఖ అధికారులు మరోసారి పొడిగించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మద్యం దుకాణాలను మరోసారి మూసివేశారు.
మే 3వరకు లాక్డౌన్ పొడిగించడం వల్ల మద్యం అమ్మకాలపై నిషేధాజ్ఞలు పొడిగిస్తూ దుకాణాలకు కొత్త సీలు వేశారు. ప్రభుత్వం ఆదేశాలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ సీఐ అశోక్ కుమార్ హెచ్చరించారు.