ETV Bharat / state

టీఎస్​ఐఐసీ స్థలంలో ఆలయం నిర్మాణం.. అడ్డుకున్న అధికారులు

author img

By

Published : Dec 10, 2019, 8:14 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పాశమైలారం గ్రామ శివారులో పారిశ్రామిక అవసరాల కోసం రిజర్వు చేసిన స్థలంలో చేపట్టిన ఆలయ నిర్మాణాన్ని టీఎస్​ఐఐసీ అధికారులు అడ్డుకున్నారు.

tsiic offices stoped temple construction in his lands in sangareddy
టీఎస్​ఐఐసీ స్థలంలో ఆలయం నిర్మాణం..అడ్డుకున్న అధికారులు

పారిశ్రామిక అవసరాల కోసం రిజర్వు చేసిన స్థలంలో చేపట్టిన ఆలయ నిర్మాణాన్ని టీఎస్​ఐఐసీ అధికారులు అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పాశమైలారం గ్రామ శివారులోని టీఎస్​ఐఐసీకి చెందిన స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డితో శంకుస్థాపన చేయించారు. ఇవాళ పునాదులు తీసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న టీఎస్​ఐఐసీ అధికారులు పనులను అడ్డుకున్నారు.

శంకుస్థాపన రోజునే పనులు చేపట్టవద్దంటూ గ్రామపంచాయతీ కార్యవర్గానికి సూచించామన్నారు ఐలా ఛైర్మన్​ చందు పొట్టి. అయినా రాత్రి సమయంలో గుంతలు తవ్వారన్నారు.

గ్రామంలో ఖాళీ స్థలం లేకపోవడం వల్లనే ఆలయం నిర్మాణానికి కొంత భూమిని వినియోగించు కోవాలనుకున్నామని పాశమైలారం ఉపసర్పంచి కృష్ణ యాదవ్ తెలిపారు. అనుమతి కోసం అధికారులకు దరఖాస్తు చేశామన్నారు.

టీఎస్​ఐఐసీ స్థలంలో ఆలయం నిర్మాణం..అడ్డుకున్న అధికారులు

ఇవీచూడండి: ఈనెల 17న వార్డుల పునర్విభజనకు తుది నోటిఫికేషన్

పారిశ్రామిక అవసరాల కోసం రిజర్వు చేసిన స్థలంలో చేపట్టిన ఆలయ నిర్మాణాన్ని టీఎస్​ఐఐసీ అధికారులు అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పాశమైలారం గ్రామ శివారులోని టీఎస్​ఐఐసీకి చెందిన స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డితో శంకుస్థాపన చేయించారు. ఇవాళ పునాదులు తీసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న టీఎస్​ఐఐసీ అధికారులు పనులను అడ్డుకున్నారు.

శంకుస్థాపన రోజునే పనులు చేపట్టవద్దంటూ గ్రామపంచాయతీ కార్యవర్గానికి సూచించామన్నారు ఐలా ఛైర్మన్​ చందు పొట్టి. అయినా రాత్రి సమయంలో గుంతలు తవ్వారన్నారు.

గ్రామంలో ఖాళీ స్థలం లేకపోవడం వల్లనే ఆలయం నిర్మాణానికి కొంత భూమిని వినియోగించు కోవాలనుకున్నామని పాశమైలారం ఉపసర్పంచి కృష్ణ యాదవ్ తెలిపారు. అనుమతి కోసం అధికారులకు దరఖాస్తు చేశామన్నారు.

టీఎస్​ఐఐసీ స్థలంలో ఆలయం నిర్మాణం..అడ్డుకున్న అధికారులు

ఇవీచూడండి: ఈనెల 17న వార్డుల పునర్విభజనకు తుది నోటిఫికేషన్

Intro:hyd_tg_31_10_tsiic_land_issu_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:


Body:పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించే స్థలం ఆలయ నిర్మాణం చేస్తున్న గ్రామపంచాయతీ కార్యవర్గాన్ని టీఎస్ ఐఐసీ అధికారులు అడ్డుకున్నారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామంలో టిఎస్ఐఐసీ కి చెందిన స్థలం శివాలయం నిర్మాణం కోసం గ్రామపంచాయతీ కార్యవర్గం పునాదులు తీశారు దీనికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా శంకుస్థాపన చేశారు టీఎస్ఐఐసీ స్థలాన్ని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించుకునేందుకు ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ వస్తున్నామని ఈ స్థలంలో కూడా పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకుంటామని ఐలా చైర్మన్ చందు పొట్టి తెలిపారు దాదాపు ఎకరం స్థలం ఉందని దాని విలువ ఐదు కోట్ల పైనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు పారిశ్రామికవాడలో ఇతర అవసరాల కోసం ఈ భూమిని వినియోగించుకునేలా చూస్తున్నామని ఆయన చెప్పారు శంకుస్థాపన జరిగే రోజున పనులు చేయవద్దని గ్రామపంచాయతీ కార్యవర్గాన్ని చెప్పడం జరిగిందని అయినా వినిపించుకోకుండా రాత్రికి రాత్రి గుంతలు తవ్వి నిర్మాణం చేపట్టారని అందువల్లే జెసిబి తో గుంతలు పూడ్చేస్తున్నామని టీఎస్ఐఐసీ అధికారులు తెలిపారు గతంలో మా దేవాలయం ఉన్న స్థలాన్ని టీఎస్ఐఐసీ అధికారులు విక్రయించారని గ్రామపంచాయతీ కార్య వర్గం మరోపక్క ఆరోపిస్తోంది


Conclusion:బైట్ భవాని టీఎస్ఐఐసీ డీజెడ్ఎమ్
బైట్ చందు పొట్టి ఐలా చైర్మన్
బైట్ కృష్ణ యాదవ్ ఉపసర్పంచి పాశమైలారం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.