ETV Bharat / state

Telangana HC on sahiti infra case: సాహితీ ఇన్​ఫ్రా కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

author img

By

Published : Feb 19, 2023, 7:11 AM IST

Telangana HC on sahiti infra case: గత సంవత్సరం ప్రీ లాంచ్ పేరుతో 2500 మందిని మోసం చేసిన సాహితీ ఇన్​ఫ్రా కంపెనీపై బాధితులు కేసులు పెట్టారు. ఈ కేసులన్నింటిని కలిపి ఒకే కేసుగా పరిగణించిన మూడు నెలల్లో విచారణ చేపట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సంస్థ మాజీ డైరెక్టర్లు వేసిన అప్పీళ్లపై విచారణ అవసరం లేదని కొట్టివేసింది.

Sahitya Infra case trial in High Court
సాహితీ ఇన్​ఫ్రా కేసు హైకోర్టులో విచారణ

Telangana HC on sahiti infra case: ప్రీ లాంచ్ పేరిట మోసాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై సాహితీ ఇన్‌ఫ్రాపై ఫిర్యాదులన్నింటినీ కలిపి ఒకే కేసుగా దర్యాప్తు చేయాలని సీసీఎస్‌ పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఒకే కేసుగా పరిగణించి మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలన్న సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తెలిపింది.

అమీన్‌పూర్‌లో సాహితీ శర్వాణి ఎలైట్ పేరుతో 25 ఎకరాల్లో 32 అంతస్తులతో 10 టవర్లు నిర్మిస్తామంటూ సుమారు 1500 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని సాహితీ ఇన్‌ఫ్రాపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. బాధితులు వేరయినప్పటికీ.. మోసం ఒకటే అయినందున.. అన్నింటినీ కలిపి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేర్వేరు పోలీస్ స్టేషన్​ల్లో కేసులు పెట్టడం లేదని దాఖలైన పలు పిటిషన్లను గతంలో విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. అన్ని కలిపి విచారణ జరిపి మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ సాహితీ ఇన్‌ఫ్రా మాజీ డైరెక్టర్లు వేసిన అప్పీళ్లు విచారణకు అర్హం కావంటూ సీజే ధర్మాసనం కొట్టివేసింది.

అసలేం జరిగింది: సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ ప్రీలాంచ్‌ ప్రాజెక్టుల పేరుతో 2,500 మంది నుంచి రూ.900 కోట్లు వసూలు చేశారు. వినియోగదారుల అందరినీ మోసం చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా టెక్‌ ఎండీ 2019లో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ గ్రామంలో సాహితీ శరవణి ఎలైట్‌ పేరుతో ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 23 ఎకరాల్లో 38 అంతస్తులతో పది అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని, 2,3 పడక గదుల ఫ్లాట్లు ఉంటాయని చెప్పారు. ఆధునిక వసతులతో తక్కువ ధరకే నిర్మిస్తామని, ప్రీ లాంఛ్‌ ఆఫర్‌ అంటూ 1,700 మంది నుంచి రూ.539 కోట్ల మేర వసూలు చేశారు.

ఇవీ చదవండి:

Telangana HC on sahiti infra case: ప్రీ లాంచ్ పేరిట మోసాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై సాహితీ ఇన్‌ఫ్రాపై ఫిర్యాదులన్నింటినీ కలిపి ఒకే కేసుగా దర్యాప్తు చేయాలని సీసీఎస్‌ పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఒకే కేసుగా పరిగణించి మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలన్న సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తెలిపింది.

అమీన్‌పూర్‌లో సాహితీ శర్వాణి ఎలైట్ పేరుతో 25 ఎకరాల్లో 32 అంతస్తులతో 10 టవర్లు నిర్మిస్తామంటూ సుమారు 1500 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని సాహితీ ఇన్‌ఫ్రాపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. బాధితులు వేరయినప్పటికీ.. మోసం ఒకటే అయినందున.. అన్నింటినీ కలిపి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేర్వేరు పోలీస్ స్టేషన్​ల్లో కేసులు పెట్టడం లేదని దాఖలైన పలు పిటిషన్లను గతంలో విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. అన్ని కలిపి విచారణ జరిపి మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ సాహితీ ఇన్‌ఫ్రా మాజీ డైరెక్టర్లు వేసిన అప్పీళ్లు విచారణకు అర్హం కావంటూ సీజే ధర్మాసనం కొట్టివేసింది.

అసలేం జరిగింది: సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ ప్రీలాంచ్‌ ప్రాజెక్టుల పేరుతో 2,500 మంది నుంచి రూ.900 కోట్లు వసూలు చేశారు. వినియోగదారుల అందరినీ మోసం చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా టెక్‌ ఎండీ 2019లో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ గ్రామంలో సాహితీ శరవణి ఎలైట్‌ పేరుతో ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 23 ఎకరాల్లో 38 అంతస్తులతో పది అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని, 2,3 పడక గదుల ఫ్లాట్లు ఉంటాయని చెప్పారు. ఆధునిక వసతులతో తక్కువ ధరకే నిర్మిస్తామని, ప్రీ లాంఛ్‌ ఆఫర్‌ అంటూ 1,700 మంది నుంచి రూ.539 కోట్ల మేర వసూలు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.