ETV Bharat / state

రాహుల్​ సభ ఏర్పాట్లను పరిశీలించిన భట్టి

ఏప్రిల్​ 1న జహీరాబాద్​లో జరిగే రాహుల్​ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి గీతా రెడ్డి సభాస్థలిని పరిశీలించారు.

author img

By

Published : Mar 28, 2019, 6:25 PM IST

Updated : Mar 28, 2019, 7:49 PM IST

పరిశీలిస్తున్న భట్టి, గీతా రెడ్డి
రాహుల్​ సభ ఏర్పాట్లను పరిశీలించిన భట్టి
తెలంగాణలో వీలైనన్ని లోక్​సభ స్థానాలు గెలవాలని కాంగ్రెస్​ కసరత్తు చేస్తోంది. పార్టీ అగ్రనాయకులతో ప్రచారానికిఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏప్రిల్​ 1న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో రాహుల్​ గాంధీ బహిరంగ సభ జరగనుంది. సభ ఏర్పాట్లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి గీతా రెడ్డి పరిశీలించారు.

సమయం ఆసన్నమైంది..

రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలిస్తే దేశాన్ని ఏ రకంగా ఏలుతారో కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తెరాస ప్రభుత్వానికి ఓటర్లు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రాహుల్ సభను జయప్రదం చేసేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు. భద్రత ఏర్పాట్లపై పోలీసు అధికారులతో భట్టి, గీతారెడ్డి చర్చించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:సీ-విజిల్ మానిటరింగ్ కేంద్రం పరిశీలన

రాహుల్​ సభ ఏర్పాట్లను పరిశీలించిన భట్టి
తెలంగాణలో వీలైనన్ని లోక్​సభ స్థానాలు గెలవాలని కాంగ్రెస్​ కసరత్తు చేస్తోంది. పార్టీ అగ్రనాయకులతో ప్రచారానికిఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏప్రిల్​ 1న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో రాహుల్​ గాంధీ బహిరంగ సభ జరగనుంది. సభ ఏర్పాట్లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి గీతా రెడ్డి పరిశీలించారు.

సమయం ఆసన్నమైంది..

రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలిస్తే దేశాన్ని ఏ రకంగా ఏలుతారో కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తెరాస ప్రభుత్వానికి ఓటర్లు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రాహుల్ సభను జయప్రదం చేసేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు. భద్రత ఏర్పాట్లపై పోలీసు అధికారులతో భట్టి, గీతారెడ్డి చర్చించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:సీ-విజిల్ మానిటరింగ్ కేంద్రం పరిశీలన

tg_srd_01_28_parishilana_av_r22 రిపోర్టర్: క్రాంతికుమార్, స్టాఫర్ కెమెరా: బిక్సపతి, కంట్రిబ్యూటర్, నర్సాపూర్ () నర్సాపూర్ లో జరిగే కేసీఆర్ ఎన్నికల ప్రచార సభకు 2లక్షల మందిని తరలిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 3తేదీ ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్ రానున్నారు. ఈ నేపథ్యంలో సభా వేదిక ఏర్పాట్లను నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ పరిశీలించారు. సభ ప్రాంగణం, వేదిక ఏర్పాట్లపై నిర్వాహకులకు ఎమ్మెల్యే, పోలీసులు పలు సూచనలు చేశారు....vis
Last Updated : Mar 28, 2019, 7:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.