ETV Bharat / state

భారీ వర్షానికి వంతెన ధ్వంసం.. రాకపోకలకు అంతరాయం

వరదల తాకిడి నుంచి సంగారెడ్డి జిల్లా ఇంకా కోలుకోకముందే మళ్లీ కురిసిన వర్షాలు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి నారాయణ ఖేడ్​ ప్రాంతంలో రోడ్లు ధ్వంసం అయ్యాయి.

author img

By

Published : Oct 18, 2020, 12:14 PM IST

roads destroyed in sangareddy district
భారీ వర్షానికి ధ్వంసమైన వంతెన.. నిలిచిన రాకపోకలు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులు దెబ్బ తిన్నాయి. పట్టణం నుంచి ఆయా గ్రామాలకు అనుసంధానం అయ్యే ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న వంతెన పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి.

కంగ్టి, సిర్గాపూర్ మండలానికి చెందిన 30 గ్రామాల నుంచి ఖేడ్​కు రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులు దెబ్బ తిన్నాయి. పట్టణం నుంచి ఆయా గ్రామాలకు అనుసంధానం అయ్యే ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న వంతెన పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి.

కంగ్టి, సిర్గాపూర్ మండలానికి చెందిన 30 గ్రామాల నుంచి ఖేడ్​కు రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: భాగ్యనగరంలో కాలనీలు జలమయం... అవస్థల్లో జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.