సంగారెడ్డి జిల్లా బొల్లారంలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి వార్షికోత్సవం నిర్వహిచింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సర్కారు మార్చి 31 వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని జిల్లా, మండల విద్యా శాఖ అధికారులను ఆదేశించింది. కానీ బొల్లారం మున్సిపాల్టీ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రభుత్వ ఉత్తర్వులు తమకు ఏమీ పట్టనట్లుగా... పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించింది. కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇదీ చూడండి: ఆర్బీఐ అభయంతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు