ETV Bharat / state

oxygen plant: ప్రభుత్వం ముందుజాగ్రత్త.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ ప్లాంట్లు

author img

By

Published : Aug 7, 2021, 6:24 PM IST

కరోనా మూడో ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలోని ప్రధాన ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. దాతల సాయంతో ప్రతి ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు తుది దశకు చేరుకోగా.. మరికొన్ని చోట్ల వేగంగా పనులు జరుగుతున్నాయి.

oxygen plants in sangareddy district hospitals
oxygen plants in sangareddy district hospitals

కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరత వైరస్ బాధితులనే కాదు ఆసుపత్రుల నిర్వాహకులను సైతం వేధించింది. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రోజుల్లో ఎప్పుడు ఆక్సిజన్ నిల్వలు అయిపోతాయో..? ఎప్పుడు సరఫరా నిలిచిపోతుందో..? అన్న ఆందోళనతోనే ఆసుపత్రుల నిర్వాహుకులు సేవలు అందించారు. మూడో దశ కరోనా వస్తే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా జిల్లాలోని ఏడు ముఖ్య ఆసుపత్రుల్లో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రిలో ఇప్పటికే లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఉండగా... దీనికి తోడు అదనంగా నిమిషానికి వెయ్యి లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పటాన్​చెరు, జహీరాబాద్, జోగిపేటలోని ప్రాంతీయ ఆసుపత్రులతో పాటు సదాశివపేట, మిర్జాపూర్​లోని సీహెచ్సీల్లో నిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. నారాయణఖేడ్​లోనూ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించారు.

ఇప్పటికే జహీరాబాద్, పటాన్​చెరు ఆసుపత్రుల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జహీరాబాద్ ఆసుపత్రికి యంత్రాలు చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో నాగ్​పూర్ నుంచి పటాన్​చెరుకు సైతం యంత్రాలు రానున్నాయి. సంగారెడ్డి, సదాశివపేట, మిర్జాపూర్​లో షెడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నారాయణఖేడ్, జోగిపేటలో స్థలం ఎంపిక పూర్తి కాగా.. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. విద్యుత్ అంతరాయంతో ఉత్పత్తిలో అటంకాలు తలెత్తకుండా ప్లాంట్లకు ప్రత్యేకంగా జనరేటర్​ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు అత్యవసర వినియోగం కోసం ప్రతి ఆసుపత్రిలో 25వేల లీటర్ల నుంచి 30వేల లీటర్ల ఆక్సిజన్​ను డీటైప్ సిలిండర్లలో నిల్వ ఉంచుకోనున్నారు.

పరిశ్రమలు సామాజిక బాధ్యతలో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మంత్రి హరీశ్ రావు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా సదాశివపేటలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, జహీరాబాద్​లో మంహీద్రా, జోగిపేటలో గ్రాన్యుయల్స్ ఇండియా, మిర్జాపూర్​లో ఫిరామిల్ పరిశ్రమలు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. జహీరాబాద్​లో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుండటంతో ఇక్కడ రెండు ప్లాంటు రానున్నాయి. జిల్లాలో ఉన్న మూడు వైద్య కళాశాలల్లో, వంద పడకలకు పైగా సామర్థ్యం ఆసుపత్రిలో స్వంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని వాటి యాజమాన్యాలకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

పదిహేను రోజుల్లో ఈ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు పనులు చేస్తున్నారు. పురోగతిపై ప్రతి రోజు ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి:

కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరత వైరస్ బాధితులనే కాదు ఆసుపత్రుల నిర్వాహకులను సైతం వేధించింది. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రోజుల్లో ఎప్పుడు ఆక్సిజన్ నిల్వలు అయిపోతాయో..? ఎప్పుడు సరఫరా నిలిచిపోతుందో..? అన్న ఆందోళనతోనే ఆసుపత్రుల నిర్వాహుకులు సేవలు అందించారు. మూడో దశ కరోనా వస్తే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా జిల్లాలోని ఏడు ముఖ్య ఆసుపత్రుల్లో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రిలో ఇప్పటికే లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఉండగా... దీనికి తోడు అదనంగా నిమిషానికి వెయ్యి లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పటాన్​చెరు, జహీరాబాద్, జోగిపేటలోని ప్రాంతీయ ఆసుపత్రులతో పాటు సదాశివపేట, మిర్జాపూర్​లోని సీహెచ్సీల్లో నిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. నారాయణఖేడ్​లోనూ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించారు.

ఇప్పటికే జహీరాబాద్, పటాన్​చెరు ఆసుపత్రుల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జహీరాబాద్ ఆసుపత్రికి యంత్రాలు చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో నాగ్​పూర్ నుంచి పటాన్​చెరుకు సైతం యంత్రాలు రానున్నాయి. సంగారెడ్డి, సదాశివపేట, మిర్జాపూర్​లో షెడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నారాయణఖేడ్, జోగిపేటలో స్థలం ఎంపిక పూర్తి కాగా.. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. విద్యుత్ అంతరాయంతో ఉత్పత్తిలో అటంకాలు తలెత్తకుండా ప్లాంట్లకు ప్రత్యేకంగా జనరేటర్​ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు అత్యవసర వినియోగం కోసం ప్రతి ఆసుపత్రిలో 25వేల లీటర్ల నుంచి 30వేల లీటర్ల ఆక్సిజన్​ను డీటైప్ సిలిండర్లలో నిల్వ ఉంచుకోనున్నారు.

పరిశ్రమలు సామాజిక బాధ్యతలో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మంత్రి హరీశ్ రావు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా సదాశివపేటలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, జహీరాబాద్​లో మంహీద్రా, జోగిపేటలో గ్రాన్యుయల్స్ ఇండియా, మిర్జాపూర్​లో ఫిరామిల్ పరిశ్రమలు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. జహీరాబాద్​లో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుండటంతో ఇక్కడ రెండు ప్లాంటు రానున్నాయి. జిల్లాలో ఉన్న మూడు వైద్య కళాశాలల్లో, వంద పడకలకు పైగా సామర్థ్యం ఆసుపత్రిలో స్వంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని వాటి యాజమాన్యాలకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

పదిహేను రోజుల్లో ఈ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు పనులు చేస్తున్నారు. పురోగతిపై ప్రతి రోజు ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.