ETV Bharat / state

కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓపీ సేవలు బంద్ - సంగారెడ్డి జిల్లా వార్తలు

ఆయుర్వేద వైద్యులకు‌ శస్త్ర చికిత్సలు చేసే అధికారాన్ని కల్పించడాన్ని ఖండిస్తూ ఇండియన్​ మెడికల్​ అసోషియేషన్​ బంద్​కు పిలుపునివ్వడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ, ప్రయ్వేట్ వైద్యులు విధులు బహిష్కరించారు. అత్యవసర సేవలు మినహా అన్నింటినీ నిలిపివేశారు.

OP services shut down in govt and private hospitals protest of the Centre's decision in sangareddy dist
కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓపీ సేవలు బంద్
author img

By

Published : Dec 11, 2020, 5:37 PM IST

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రయ్వేట్​ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఆయుర్వేద వైద్యులకు‌ శస్త్ర చికిత్సలు చేసే అధికారాన్ని కల్పించడాన్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ ఇండియన్​ మెడికల్​ అసోషియేషన్​ బంద్​కు పిలుపునిచ్చింది.

అత్యవసర, కరోనా చికిత్సలు మినహా అన్ని సేవలను ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిలిపివేస్తున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. దేశమంతా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని వైద్యులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:రైతు ఖాతాలో 4 వందల కోట్లు... చేతికి పైసా రావట్లేదు...!

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రయ్వేట్​ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఆయుర్వేద వైద్యులకు‌ శస్త్ర చికిత్సలు చేసే అధికారాన్ని కల్పించడాన్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ ఇండియన్​ మెడికల్​ అసోషియేషన్​ బంద్​కు పిలుపునిచ్చింది.

అత్యవసర, కరోనా చికిత్సలు మినహా అన్ని సేవలను ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిలిపివేస్తున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. దేశమంతా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని వైద్యులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:రైతు ఖాతాలో 4 వందల కోట్లు... చేతికి పైసా రావట్లేదు...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.