కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో హెచ్ఎంఎస్ సత్తా చాటింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మాజీ హోంమంత్రి, హెచ్ఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు నాయిని నరసింహారెడ్డి గెలుపొందారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డిపై 136 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి కార్మిక సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని నాయిని తెలిపారు.
ఇదీ చూడండి: ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి మృతి