సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో క్రైస్తవ పాస్టర్లకు ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పట్టణంలోని మెథడిస్ట్ రూరల్ చర్చిలో డివిజన్లోని పాస్టర్లకు నెలకు సరిపడా బియ్యం, పప్పు, నూనెలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు.
కరోనా కారణంగా మూడు నెలలుగా చర్చిలు, మసీదులు, ఆలయాలు మూతపడి అర్చకులు, పాస్టర్లు, మత గురువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి ఆకలి తీర్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
ఇవీ చూడండి: మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం