ETV Bharat / state

కరోనా వ్యాక్సిన్​ రెండో డోసు తీసుకున్న ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి

కరోనా వ్యాక్సిన్​ మొదటి డోసు తీసుకున్న ప్రతి ఒక్కరూ విధిగా రెండో డోసు తీసుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి సూచించారు. పటాన్​చెరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆయన కొవిడ్​ రెండో టీకా వేయించుకున్నారు.

author img

By

Published : May 8, 2021, 7:57 PM IST

MLA Mahipal Reddy taking the second dose of corona vaccine
MLA Mahipal Reddy taking the second dose of corona vaccine

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి కొవిడ్​ వ్యాక్సిన్​ రెండో డోసు తీసుకున్నారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో తన కుటుంబసభ్యులతో టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా మొదటి డోసు వేయించుకున్న ప్రతి ఒక్కరూ.. రెండో డోసు విధిగా వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇందుకు సంబంధించి వైద్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

ఎమ్మెల్యేతో పాటు జడ్పీటీసీ సుప్రజా వెంకట్​రెడ్డి దంపతులు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ దంపతులు, తెరాస పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు వ్యాక్సిన్ చేయించుకున్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి కొవిడ్​ వ్యాక్సిన్​ రెండో డోసు తీసుకున్నారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో తన కుటుంబసభ్యులతో టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా మొదటి డోసు వేయించుకున్న ప్రతి ఒక్కరూ.. రెండో డోసు విధిగా వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇందుకు సంబంధించి వైద్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

ఎమ్మెల్యేతో పాటు జడ్పీటీసీ సుప్రజా వెంకట్​రెడ్డి దంపతులు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ దంపతులు, తెరాస పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు వ్యాక్సిన్ చేయించుకున్నారు.

ఇదీ చూడండి.. తెలుగు రాష్ట్రాలకు ప్రాణవాయువు అందించేందుకు 'మేఘా' సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.