ETV Bharat / state

రూ. 20 కోట్ల వ్యయంతో సాకి చెరువు సుందరీకరణ

పటాన్​చెరు పరిధిలోని సాకి చెరువుకు నూతన శోభ చేకూరనుంది. రూ. 20 కోట్ల నిధులతో చెరువు సుందరీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.

author img

By

Published : Apr 29, 2021, 1:07 PM IST

saaki pond beautification
సాకి చెరువు సుందరీకరణ

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణ పరిధిలో ఉన్న సాకి చెరువును రూ. 20 కోట్ల నిధులతో సుందరీకరణ చేయనున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సంబంధిత పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. రూ.20 కోట్ల అంచనా వ్యయంలో హెచ్ఎండీఏ నుంచి రూ. 10 కోట్లు, జీహెచ్ఎంసీ నుంచి మిగిలిన 10 కోట్లు బ్యూటిఫికేషన్​ పనులకు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.

చెరువు కట్టపై 40 ఫీట్ల విస్తీర్ణంతో రోడ్డు, డివైడర్, హైమాస్ట్​ దీపాలు, వాకింగ్ ట్రాక్, పార్కు, కూర్చునేందుకు బల్లలు, సెంట్రల్ లైటింగ్, గార్డెనింగ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణ పరిధిలో ఉన్న సాకి చెరువును రూ. 20 కోట్ల నిధులతో సుందరీకరణ చేయనున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సంబంధిత పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. రూ.20 కోట్ల అంచనా వ్యయంలో హెచ్ఎండీఏ నుంచి రూ. 10 కోట్లు, జీహెచ్ఎంసీ నుంచి మిగిలిన 10 కోట్లు బ్యూటిఫికేషన్​ పనులకు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.

చెరువు కట్టపై 40 ఫీట్ల విస్తీర్ణంతో రోడ్డు, డివైడర్, హైమాస్ట్​ దీపాలు, వాకింగ్ ట్రాక్, పార్కు, కూర్చునేందుకు బల్లలు, సెంట్రల్ లైటింగ్, గార్డెనింగ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టు సీరియస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.