ETV Bharat / state

కంగ్టి మండల కార్యాలయంలో కరోనా.. సిబ్బంది మొత్తం క్వారంటైన్! - కరోనా వార్తలు

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. మండల కార్యాలయంలో  పనిచేసే ఓ అధికారికి కరోనా పాజిటివ్​ సోకగా.. కార్యాలయ సిబ్బంది మొత్తం పరీక్షలు చేసుకొని 14 రోజులు హోమ్​ క్వారంటైన్​లో ఉండాలని జిల్లా కలెక్టర్​ ఆదేశించారు.

Kangti mandal Officer Gets Corona Positive
కంగ్టి మండల కార్యాలయంలో కరోనా.. సిబ్బంది మొత్తం క్వారంటైన్!
author img

By

Published : Aug 1, 2020, 9:15 AM IST

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం ప్రజా పరిషత్తు కార్యాలయంలో అధికారి ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. పాజిటివ్​ వచ్చిన అధికారి కార్యాలయ పనుల నిమిత్తం నిత్యం హైదరాబాద్ నుంచి రాకపోకలు చేస్తుంటారు. పాజిటివ్​ వచ్చిన అధికారి రెండు రోజుల క్రితం మండల కార్యాలయంలో విధులకు హాజరయ్యారు. ఆయనకు కొవిడ్-19 పాజిటివ్​ సోకిందని తెలియగానే.. కార్యాలయ సిబ్బంది అందరూ పరీక్షలు చేయించుకోవాలని, 14 రోజులు హోమ్ క్వారంటైన్​ లో ఉండాలని జిల్లా కలెక్టర్​ సిబ్బందికి ఆదేశించారు. జులై 30న ఎంపీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సదరు అధికారి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధికారులు సైతం పాల్గొన్నారు. అధికారికి కరోనా విషయం తెలియగానే వారంతా ఆందోళనకు గురవుతున్నారు.

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం ప్రజా పరిషత్తు కార్యాలయంలో అధికారి ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. పాజిటివ్​ వచ్చిన అధికారి కార్యాలయ పనుల నిమిత్తం నిత్యం హైదరాబాద్ నుంచి రాకపోకలు చేస్తుంటారు. పాజిటివ్​ వచ్చిన అధికారి రెండు రోజుల క్రితం మండల కార్యాలయంలో విధులకు హాజరయ్యారు. ఆయనకు కొవిడ్-19 పాజిటివ్​ సోకిందని తెలియగానే.. కార్యాలయ సిబ్బంది అందరూ పరీక్షలు చేయించుకోవాలని, 14 రోజులు హోమ్ క్వారంటైన్​ లో ఉండాలని జిల్లా కలెక్టర్​ సిబ్బందికి ఆదేశించారు. జులై 30న ఎంపీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సదరు అధికారి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధికారులు సైతం పాల్గొన్నారు. అధికారికి కరోనా విషయం తెలియగానే వారంతా ఆందోళనకు గురవుతున్నారు.

ఇవీ చూడండి:ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.