ETV Bharat / state

'గంగపుత్రులను ప్రోత్సహించడం కోసమే చేపపిల్లల పంపిణీ'

author img

By

Published : Aug 16, 2020, 8:18 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్, సిర్గాపూర్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల చెరువుల్లో చేప పిల్లలను స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వం గంగపుత్రులను ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు.

'గంగపుత్రులను ప్రోత్సహించడం కోసమే చేపపిల్లల పంపిణీ'
'గంగపుత్రులను ప్రోత్సహించడం కోసమే చేపపిల్లల పంపిణీ'

ప్రభుత్వం గంగపుత్రులను ప్రోత్సహిస్తూ... చెరువులలో ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపట్టిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్, సిర్గాపూర్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల చెరువుల్లో చేప పిల్లల పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలంలో చెరువులలో నీరు చేరుతాయని వాటిలో చేపపిల్లలు వదలడం వల్ల 6 నెలలో చేపల పంట చేతికంది గంగపుత్రులకు ఎంతో లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే అన్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలు అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని వ్యవసాయంతో పాటు ఇతర లాభదాయకమైన ఆదాయ వనరులను సమకూర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, తెరాస కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం గంగపుత్రులను ప్రోత్సహిస్తూ... చెరువులలో ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపట్టిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్, సిర్గాపూర్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల చెరువుల్లో చేప పిల్లల పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలంలో చెరువులలో నీరు చేరుతాయని వాటిలో చేపపిల్లలు వదలడం వల్ల 6 నెలలో చేపల పంట చేతికంది గంగపుత్రులకు ఎంతో లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే అన్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలు అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని వ్యవసాయంతో పాటు ఇతర లాభదాయకమైన ఆదాయ వనరులను సమకూర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, తెరాస కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.