ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ భారత్​ కథనాలకు స్పందన... అన్నార్తులకు భరోసా - వలస కూలీలకు నిత్యావసర సరకులు

ఈనాడు- ఈటీవీ భారత్​ చొరవతో మహారాష్ట్ర నుంచి పొట్టకూటి కోసం వచ్చిన వలస కూలీలకు భరోసా దొరికింది. కూలీలు పడుతున్న కష్టాలను 'ఈనాడు-ఈటీవీ భారత్​'లు వెలుగులోకి తేవడం వల్ల పలువురు దాతలు స్పందించారు. వలస కూలీలకు నెలకు సరిపడా సరకులను అందజేశారు.

donors respond to eenadu etv bharat stories in sangareddy district
ఈనాడు-ఈటీవీ భారత్​ కథనాలకు స్పందన... అన్నార్తులకు భరోసా
author img

By

Published : Apr 29, 2020, 11:38 PM IST

ఈనాడు-ఈటీవీ భారత్​లలో ఇచ్చిన కథనాలకు స్పందనగా అన్నార్తులకు భరోసా దొరికింది. ఆకలి తీర్చడానికి మేమున్నామంటూ దాతలు ముందుకొచ్చారు. అర్థాకలితో అల్లాడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ శివారులో మహారాష్ట్రకు చెందిన కూలీలు పడుతున్న ఇబ్బందులను ' ఈనాడు- ఈటీవీ భారత్'లు వెలుగులోకి తెచ్చాయి. కనీసం చిన్నారుల కోసం పాలు కూడా కొనుగోలు చేయలేకపోతున్న తీరుపై 'పాలు లేక.. పాలుపోక!' శీర్షికన ఈ నెల 28న కథనాన్ని అందించింది. తెరాస రాష్ట్ర నేత భిక్షపతి ఈ కథనాన్ని చదివి చలించిపోయారు. తన బృందంతో కలిసి బుధవారం కూలీలు నివాసముంటున్న చోటకు వచ్చారు . 70 కుటుంబాలకు సరకులు అందించారు.

ఒక్కో కుటుంబానికి 12కిలోల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసరాలతో పాటు లీటరు పాలను పంపిణీ చేశారు. వీరంతా ప్రతి గుడిసె వద్దకు వెళ్లి నేరుగా అక్కడే సరకులు అందించారు. ఇప్పటికే ఈ కూలీ కుటుంబాలకు జిల్లా సంక్షేమ శాఖ , సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బాలామృతం, పాలు , బియ్యం, కోడిగుడ్లు అందాయి. తమ కష్టాన్ని వెలుగులోకి తెచ్చి సాయం అందేలా చూసిన 'ఈనాడు'తో పాటు స్పందించిన దాతలకూ కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈనాడు-ఈటీవీ భారత్​లలో ఇచ్చిన కథనాలకు స్పందనగా అన్నార్తులకు భరోసా దొరికింది. ఆకలి తీర్చడానికి మేమున్నామంటూ దాతలు ముందుకొచ్చారు. అర్థాకలితో అల్లాడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ శివారులో మహారాష్ట్రకు చెందిన కూలీలు పడుతున్న ఇబ్బందులను ' ఈనాడు- ఈటీవీ భారత్'లు వెలుగులోకి తెచ్చాయి. కనీసం చిన్నారుల కోసం పాలు కూడా కొనుగోలు చేయలేకపోతున్న తీరుపై 'పాలు లేక.. పాలుపోక!' శీర్షికన ఈ నెల 28న కథనాన్ని అందించింది. తెరాస రాష్ట్ర నేత భిక్షపతి ఈ కథనాన్ని చదివి చలించిపోయారు. తన బృందంతో కలిసి బుధవారం కూలీలు నివాసముంటున్న చోటకు వచ్చారు . 70 కుటుంబాలకు సరకులు అందించారు.

ఒక్కో కుటుంబానికి 12కిలోల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసరాలతో పాటు లీటరు పాలను పంపిణీ చేశారు. వీరంతా ప్రతి గుడిసె వద్దకు వెళ్లి నేరుగా అక్కడే సరకులు అందించారు. ఇప్పటికే ఈ కూలీ కుటుంబాలకు జిల్లా సంక్షేమ శాఖ , సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బాలామృతం, పాలు , బియ్యం, కోడిగుడ్లు అందాయి. తమ కష్టాన్ని వెలుగులోకి తెచ్చి సాయం అందేలా చూసిన 'ఈనాడు'తో పాటు స్పందించిన దాతలకూ కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్​... అర్ధాకలితో అలమటిస్తున్న చిన్నారులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.