ETV Bharat / state

పర్శపల్లిలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా​ - Parshapally corona cases news

రాష్ట్రంలో కరోనా రెండోదశ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. పట్టణాలతో పాటు పల్లెల్లోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా పర్శపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి పాజిటివ్​గా నిర్ధారణ అయింది.

Corona for six members in the same family
ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా​
author img

By

Published : Apr 4, 2021, 3:47 PM IST

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పర్శపల్లిలో కరోనా కలవరం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వైరస్​ బారినపడ్డారు. ఫలితంగా గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు.

విషయం తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ అధికారులు గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రధాన వీధుల్లో రసాయన ద్రావణాలను పిచికారీ చేయించారు. కేసులు నమోదైన వీధిని కంటైన్​మెంట్ జోన్​గా ప్రకటించారు. రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పర్శపల్లిలో కరోనా కలవరం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వైరస్​ బారినపడ్డారు. ఫలితంగా గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు.

విషయం తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ అధికారులు గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రధాన వీధుల్లో రసాయన ద్రావణాలను పిచికారీ చేయించారు. కేసులు నమోదైన వీధిని కంటైన్​మెంట్ జోన్​గా ప్రకటించారు. రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.

ఇదీ చూడండి: సిరిపూర్​లో లాక్​డౌన్ విధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.