ETV Bharat / state

పెద్దాపూర్​లో నీటి సరఫరా ప్లాంటు నమూనాను పరిశీలించిన స్మితా సబర్వాల్

author img

By

Published : Nov 26, 2020, 7:33 PM IST

సంగారెడ్డి జిల్లాలోని పలు నీటి శుద్ధి కేంద్రాలను ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. హైదరాబాద్​కు నీటి సరఫరా చేసేందుకు పెద్దాపూర్​లో నిర్మిస్తున్న ప్లాంట్​ నమూనాను ఆమె సందర్శించారు.

CM special secretery peddapur visit water plant in sangareddy district  Slug
పెద్దాపూర్​లో నీటి సరఫరా ప్లాంటు నమూనాను పరిశీలించిన స్మితా సబర్వాల్

సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న జలాశయాల నిర్మాణ పనులను సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ తనిఖీ చేశారు. పుల్కల్ మండలం సింగూరు జలాశయం వద్ద గల ఇంటెక్​ వెల్​, సంగారెడ్డి మండలం రాజంపేటలో ఉన్న మొదటి, రెండో దశ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.

హైదరాబాద్​కు నీటి సరఫరా కోసం పెద్దాపూర్​లో నిర్మిస్తున్న ట్రీట్​మెంట్​ ప్లాంటు నమూనాను స్మితా సబర్వాల్​ వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి హనుమంతరావు, ఈడీ సత్యనారాయణ, డీటీ రవికుమార్, జీఎం రామకృష్ణ, నీటిపారుదలశాఖ సీఈ మధుసూదన్​రావు, ఈఈ మధుసూదన్​రెడ్డి, మిషన్​ భగీరథ ఈఈ కృపాకర్​రెడ్డి, సీఈ చక్రవర్తి, ఎస్​ఈ రఘువీర పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో సంచార కరోనా పరీక్షలు పెంచాలి: హైకోర్టు

సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న జలాశయాల నిర్మాణ పనులను సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ తనిఖీ చేశారు. పుల్కల్ మండలం సింగూరు జలాశయం వద్ద గల ఇంటెక్​ వెల్​, సంగారెడ్డి మండలం రాజంపేటలో ఉన్న మొదటి, రెండో దశ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.

హైదరాబాద్​కు నీటి సరఫరా కోసం పెద్దాపూర్​లో నిర్మిస్తున్న ట్రీట్​మెంట్​ ప్లాంటు నమూనాను స్మితా సబర్వాల్​ వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి హనుమంతరావు, ఈడీ సత్యనారాయణ, డీటీ రవికుమార్, జీఎం రామకృష్ణ, నీటిపారుదలశాఖ సీఈ మధుసూదన్​రావు, ఈఈ మధుసూదన్​రెడ్డి, మిషన్​ భగీరథ ఈఈ కృపాకర్​రెడ్డి, సీఈ చక్రవర్తి, ఎస్​ఈ రఘువీర పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో సంచార కరోనా పరీక్షలు పెంచాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.