సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికసంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కరోనా నివారణలో ముందుండి పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.50లక్షల బీమా వర్తింపజేయాలని కోరారు.
నెలకు రూ.25వేల వేతనంతో పాటు బియ్యం, నిత్యవసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. రెడ్ జోన్లో పనిచేస్తున్న వారందరికీ పీపీఈ కిట్లు ఇచ్చి ప్రజాఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు చప్పట్లు, పూలు చల్లటంతోనే సరిపోదని వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.