ETV Bharat / state

పూల జల్లులు కాదు... పీపీఈ కిట్లు ఇవ్వండి - CITU Dharna for workers' rights

లాక్​డౌన్ నేపథ్యంలో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేసి నెలకు 25 వేల రూపాయల వేతనం ఇవ్వాలని సంగారెడ్డి అమీన్పూర్​లో సీఐటీయూ నాయకులు డిమాండ్​ చేశారు. రెడ్​జోన్​లో పనిచేస్తున్న కార్మికులకు పీపీఈ కిట్లను ఇవ్వాలని సూచించారు.

CITU leaders protest in Sangareddy
పూల జల్లులు కాదు... పీపీఈ కిట్లు ఇవ్వండి
author img

By

Published : May 14, 2020, 5:36 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్​లో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికసంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కరోనా నివారణలో ముందుండి పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అలాగే రూ.50లక్షల బీమా వర్తింపజేయాలని కోరారు.

నెలకు రూ.25వేల వేతనంతో పాటు బియ్యం, నిత్యవసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. రెడ్ జోన్​లో పనిచేస్తున్న వారందరికీ పీపీఈ కిట్లు ఇచ్చి ప్రజాఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు చప్పట్లు, పూలు చల్లటంతోనే సరిపోదని వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్​లో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికసంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కరోనా నివారణలో ముందుండి పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అలాగే రూ.50లక్షల బీమా వర్తింపజేయాలని కోరారు.

నెలకు రూ.25వేల వేతనంతో పాటు బియ్యం, నిత్యవసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. రెడ్ జోన్​లో పనిచేస్తున్న వారందరికీ పీపీఈ కిట్లు ఇచ్చి ప్రజాఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు చప్పట్లు, పూలు చల్లటంతోనే సరిపోదని వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.