సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో ఖానాపూర్ గ్రామంలోని వృద్ధ మహిళ మరణించింది. కానీ కుటుంబీకులు, బంధువులు ఎవ్వరూ రాలేదు. స్థానిక యువకులు అన్నీ తామే అయ్యి ఆ వృద్ధురాలికి అంత్య క్రియలు నిర్వహించారు. మళ్లిన వృద్ధురాలు పొట్టకూటి కోసం నారాయణఖేడ్లో రోజూ బిక్షాటన చేస్తూ జీవిస్తుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానల కారణంగా తడిసి ఆమె మరణించిందని గ్రామస్థులు చెప్తున్నారు.
ఇదీ చూడండి : జలాశయంలో సౌర విద్యుత్ కేంద్రం