ETV Bharat / state

ధరలు పెంచుతూ పేదలపై భారం మోపుతున్న మోదీ: ఆప్ - Sangareddy District Latest News

జహీరాబాద్​లో ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన చేపట్టింది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్​ చేసింది. పేదలపై కేంద్రం భారం మోపుతోందని ఆరోపించింది.

Aam Aadmi Party has staged a protest in Zaheerabad
జహీరాబాద్​లో ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన
author img

By

Published : Feb 22, 2021, 7:33 PM IST

వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచుతూ పేదలపై కేంద్రం భారం మోపుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ ప్రియాంక కక్కర్ ఆరోపించారు. ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రధాన రహదారిపై చీపుర్లు ప్రదర్శిస్తూ మోదీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

మోదీ ప్రభుత్వం ధరలు పెంచుతూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. దిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో బలపడతామని ధీమా వ్యక్తం చేశారు.

వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచుతూ పేదలపై కేంద్రం భారం మోపుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ ప్రియాంక కక్కర్ ఆరోపించారు. ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రధాన రహదారిపై చీపుర్లు ప్రదర్శిస్తూ మోదీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

మోదీ ప్రభుత్వం ధరలు పెంచుతూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. దిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో బలపడతామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: వాళ్లకు ఓటుతో గుణపాఠం చెబుదాం: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.