సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణానికి చెందిన జాహేదా బేగం మృతి చెందింది. మృతురాలి కుమారుడు సౌదీ అరేబియాలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. తల్లి మరణవార్త తెలిసినా లాక్డౌన్ కారణంగా ఇంటికి రాలేని పరిస్థితి. కుమారుడు రాలేకపోవడం వల్ల మృతురాలి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.
కడసారి చూపు నోచుకోలేని కుమారుడు వీడియోకాల్లోనే తల్లి అంత్యక్రియలను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.