ETV Bharat / state

గుప్తనిధుల కోసం వచ్చి.. గ్రామస్తులకు దొరికిపోయారు! - రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం

ఊరిలో ఉన్న దేవాలయంలో గుప్త నిధులు తవ్వుదామని.. ప్లాన్​ వేసుకొని వచ్చారు. ఎలాగోలా గుట్టల్లో ఉన్న గుడిలోకి వెళ్లారు. ఎవరూ చూడటం లేదనుకొని తవ్వకాలు ప్రారంభించారు. ఇంతలోనే.. ఆలయ నిర్వాహకులు, పొలాల వద్ద ఉన్న రైతులు గమనించారు. గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అంతే.. గుప్త నిధుల కోసం వచ్చిన దొంగలు రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయారు.

Villagers Caught Excavations of cryptocurrencies Thieves  In Rangareddy District
గుప్తనిధుల కోసం వచ్చి.. గ్రామస్తులకు దొరికిపోయారు!
author img

By

Published : May 25, 2020, 4:59 PM IST

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్​జాల గ్రామంలో గోవిందరాజు గుట్టలో పురాతన దేవాలయం ఉంది. గ్రామస్తులు ఆ దేవాలయంలో నిత్యం పూజలు చేస్తూ కాపాడుకుంటున్నారు. పురాతన ఆలయం కావడం, అది కూడా గుట్టల్లో ఉండడం వల్ల తవ్వితే నిధులు దొరుకుతాయని భావించిన ముగ్గురు వ్యక్తులు ఆ ఊరికి వచ్చారు. గోవిందరాజు గుట్టల్లో ఉన్న దేవాలయం వద్దకు వెళ్లారు. గుట్టల మధ్యలో తవ్వకాలు మొదలుపెట్టారు. అక్కడే ఉన్న ఆలయ నిర్వాహకులు అది గమనించారు. గుట్టు చప్పుడు కాకుండా గ్రామస్తులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ముగ్గురిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ముగ్గురిలో ఒకరు పోలీస్​ కానిస్టేబుల్​గా పనిచేస్తూ సెలవుపై ఉన్నాడు. ముగ్గురు నిందితులు ఎక్కడి వారు.. ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలు తెలియాల్సి ఉందని, గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు తలకొండపల్లి ప లీసులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్​జాల గ్రామంలో గోవిందరాజు గుట్టలో పురాతన దేవాలయం ఉంది. గ్రామస్తులు ఆ దేవాలయంలో నిత్యం పూజలు చేస్తూ కాపాడుకుంటున్నారు. పురాతన ఆలయం కావడం, అది కూడా గుట్టల్లో ఉండడం వల్ల తవ్వితే నిధులు దొరుకుతాయని భావించిన ముగ్గురు వ్యక్తులు ఆ ఊరికి వచ్చారు. గోవిందరాజు గుట్టల్లో ఉన్న దేవాలయం వద్దకు వెళ్లారు. గుట్టల మధ్యలో తవ్వకాలు మొదలుపెట్టారు. అక్కడే ఉన్న ఆలయ నిర్వాహకులు అది గమనించారు. గుట్టు చప్పుడు కాకుండా గ్రామస్తులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ముగ్గురిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ముగ్గురిలో ఒకరు పోలీస్​ కానిస్టేబుల్​గా పనిచేస్తూ సెలవుపై ఉన్నాడు. ముగ్గురు నిందితులు ఎక్కడి వారు.. ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలు తెలియాల్సి ఉందని, గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు తలకొండపల్లి ప లీసులు తెలిపారు.

ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.