ETV Bharat / state

చేవెళ్ల మండలంలో తొలి కరోనా మరణం - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో తొలిసారిగా కొవిడ్‌ సోకి మరణించారు. ఈ మండలంలో కరోనాతో తొలి మరణం ఇదే. మల్లారెడ్డి గూడకు చెందిన వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందగా.. కోలుకుని డిశ్ఛార్జ్‌ అయ్యాడు. నాలుగు రోజుల క్రితం మళ్లీ అస్వస్థకు గురై చనిపోయాడు.

చేవెళ్ల మండలంలో తొలి కరోనా మరణం
చేవెళ్ల మండలంలో తొలి కరోనా మరణం
author img

By

Published : Jul 11, 2020, 1:54 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో తొలి కరోనా మరణం నమోదైంది. చేవెళ్ల మండలంలోని మల్లారెడ్డి గూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నెల రోజుల క్రితం వైరస్‌ సోకిన అతడు కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగైంది.

అయితే నాలుగు రోజుల క్రితం మళ్లీ అస్వస్థతకు గురి కావడం వల్ల గాంధీకి తరలించారు. కాకపోతే అప్పటికే పరిస్థితి విషమించి మరణించినట్లు సమాచారం. మండలంలో ఇప్పటివరకు 30 మంది మహమ్మారి బారిన పడగా.. ఇది తొలి మరణం.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో తొలి కరోనా మరణం నమోదైంది. చేవెళ్ల మండలంలోని మల్లారెడ్డి గూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నెల రోజుల క్రితం వైరస్‌ సోకిన అతడు కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగైంది.

అయితే నాలుగు రోజుల క్రితం మళ్లీ అస్వస్థతకు గురి కావడం వల్ల గాంధీకి తరలించారు. కాకపోతే అప్పటికే పరిస్థితి విషమించి మరణించినట్లు సమాచారం. మండలంలో ఇప్పటివరకు 30 మంది మహమ్మారి బారిన పడగా.. ఇది తొలి మరణం.

ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.