రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అండర్ 14 బాలబాలికల బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించారు. హైదరాబాద్లోని దిల్లీ పబ్లిక్ పాఠశాలలో మూడురోజులపాటు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 240 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంతర్జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారుడు వినయ్ యాదవ్ హాజరై అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండిః తొలిసారిగా ఫుట్బాల్ స్టేడియంలో ఇరాన్ మహిళలు