ETV Bharat / state

కబ్జాకోరల్లో జల్​పల్లి చెరువు.. 'వరద' విషాదానికి కారణం అదేనా..?

author img

By

Published : Oct 24, 2020, 11:02 PM IST

ఇటీవల కురిసిన వర్షాలకు జల్​పల్లి చెరువు మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. చెరువు పొంగి వేల కుటుంబాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా.. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. వరదల్లో చిక్కుకుని పలువురు తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. ఈ క్రమంలోనే జల్​పల్లి చెరువు కబ్జాలు, వరదల ప్రస్తుత పరిస్థితిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

special-story-on-jalpalli-pond-in-rangareddy-district
కబ్జాకోరల్లో జల్​పల్లి చెరువు.. 'వరద' విషాదానికి కారణం అదేనా..?

హైదరాబాద్ జంట నగరాల్లోని చెరువులు కబ్జాలకు గురయ్యాయి. ఒకప్పటి చెరువుల స్థలాల్లో.. నేడు పదుల సంఖ్యలో కాలనీలు వెలిశాయి. దీనికి తోడు చెత్తా చెదారం, భవన నిర్మాణ శిథిలాలతో నగరంలోని చాలా చెరువుల రూపురేఖలు మారిపోయాయి. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలోని జల్​పల్లి పెద్ద చెరువు విస్తీర్ణం సగానికి తగ్గిపోయింది. ఫలితంగా వర్షం పడితే చాలు.. రోడ్లపైకి వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోతున్నాయి.

అడ్డూ అదుపు లేదు..

జల్​పల్లి చెరువుకు జల్​పల్లి గ్రామంతో పాటు మామిడిపల్లి, పహాడీషరీఫ్ చెరువుల నీరు నీరు వచ్చి చేరుతుంది. జల్​పల్లి చెరువు పూర్తి విస్తీర్ణం 299 ఎకరాలు కాగా.. సుమారు 100 ఎకరాల వరకు కబ్జాకు గురై, ప్రస్తుతం 199 ఎకరాల్లో మాత్రమే చెరువు ఉంది. దీనికి తోడు 100కు పైచిలుకు ఎకరాల్లో ఎఫ్​టీఎల్​లో పట్టాదారులు ఉన్నారు. నిబంధనల ప్రకారం చెరువు శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. పట్టాదారులు అయినప్పటికీ కేవలం నీరు లేనప్పుడు పంట వేసుకోవచ్చు. కానీ ఇక్కడి ఎఫ్ టీఎల్ పరిధిలో మొత్తం భవణ నిర్మాణాలు చేపట్టారు. పలువురు ఇళ్లు నిర్మించుకోగా.. ఇంకొందరు గోదాంలు నిర్మించుకున్నారు. మిగతా ప్రాంతాల్లో ఎఫ్​ టీఎల్ పరిధితో పాటు.. చెరువు భూముల్లో సైతం వెంచర్లు వేస్తున్నారు.

రహదారులపైకి నీరు..

జల్​పల్లి చెరువులో ఆక్రమణలు ఎక్కువ కావడం వల్ల ఇటీవల కురిసిన వర్షానికి జల్​పల్లిలో ప్రధాన రహదారి నీట మునిగింది. రాకపోకలు స్థంభించిపోయాయి. మైలార్​దేవునిపల్లి నుంచి జల్​పల్లి వెళ్లే రహదారిపై నీరు ఇంకా నిలిచే ఉంది. పహాడీషరీఫ్ నుంచి జల్​పల్లికి వెళ్లే రహదారిని మూసివేశారు. ఈ నేపథ్యంలో పహాడీషరీఫ్ నుంచి జల్​పల్లి వెళ్లేందుకు దాదాపు 6 కిలో మీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

30 వేల మందిపై ప్రభావం..

జల్​పల్లి చెరువు నిండితే.. దాని ప్రభావం జల్​పల్లిలోని సుమారు 30 వేల జనాభాపై పడుతోంది. జల్​పల్లి శివారు కాలనీలు, గోదాముల్లోకి వరద నీరు వస్తోంది. జల్​పల్లి చెరువు నుంచి పిరంగి నాలా ద్వారా ఇతర చెరువుల్లోకి నీరు వెళ్లి, అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం చెరువు వైపునకు వెళ్తాయి. కానీ పిరంగి నాలా మొత్తం కబ్జాకు గురి కావడం వల్ల నీరు గ్రామంలోకి వస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీరామ్ నగర్ కాలనీ, పి-7 రోడ్డు వైపు కట్ట తెగి లక్ష్మీగూడ, వాంబే కాలనీ ముంపులో చిక్కుకున్నాయి.

ఈ నేపథ్యంలో నాయకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో వల్లే కబ్జాలు ఎక్కువయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కబ్జాలను ఆపాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి.. కబ్జాదారుల కోరల్లో పెద్ద చెరువు.. మోక్షం ఎప్పటికో!

హైదరాబాద్ జంట నగరాల్లోని చెరువులు కబ్జాలకు గురయ్యాయి. ఒకప్పటి చెరువుల స్థలాల్లో.. నేడు పదుల సంఖ్యలో కాలనీలు వెలిశాయి. దీనికి తోడు చెత్తా చెదారం, భవన నిర్మాణ శిథిలాలతో నగరంలోని చాలా చెరువుల రూపురేఖలు మారిపోయాయి. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలోని జల్​పల్లి పెద్ద చెరువు విస్తీర్ణం సగానికి తగ్గిపోయింది. ఫలితంగా వర్షం పడితే చాలు.. రోడ్లపైకి వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోతున్నాయి.

అడ్డూ అదుపు లేదు..

జల్​పల్లి చెరువుకు జల్​పల్లి గ్రామంతో పాటు మామిడిపల్లి, పహాడీషరీఫ్ చెరువుల నీరు నీరు వచ్చి చేరుతుంది. జల్​పల్లి చెరువు పూర్తి విస్తీర్ణం 299 ఎకరాలు కాగా.. సుమారు 100 ఎకరాల వరకు కబ్జాకు గురై, ప్రస్తుతం 199 ఎకరాల్లో మాత్రమే చెరువు ఉంది. దీనికి తోడు 100కు పైచిలుకు ఎకరాల్లో ఎఫ్​టీఎల్​లో పట్టాదారులు ఉన్నారు. నిబంధనల ప్రకారం చెరువు శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. పట్టాదారులు అయినప్పటికీ కేవలం నీరు లేనప్పుడు పంట వేసుకోవచ్చు. కానీ ఇక్కడి ఎఫ్ టీఎల్ పరిధిలో మొత్తం భవణ నిర్మాణాలు చేపట్టారు. పలువురు ఇళ్లు నిర్మించుకోగా.. ఇంకొందరు గోదాంలు నిర్మించుకున్నారు. మిగతా ప్రాంతాల్లో ఎఫ్​ టీఎల్ పరిధితో పాటు.. చెరువు భూముల్లో సైతం వెంచర్లు వేస్తున్నారు.

రహదారులపైకి నీరు..

జల్​పల్లి చెరువులో ఆక్రమణలు ఎక్కువ కావడం వల్ల ఇటీవల కురిసిన వర్షానికి జల్​పల్లిలో ప్రధాన రహదారి నీట మునిగింది. రాకపోకలు స్థంభించిపోయాయి. మైలార్​దేవునిపల్లి నుంచి జల్​పల్లి వెళ్లే రహదారిపై నీరు ఇంకా నిలిచే ఉంది. పహాడీషరీఫ్ నుంచి జల్​పల్లికి వెళ్లే రహదారిని మూసివేశారు. ఈ నేపథ్యంలో పహాడీషరీఫ్ నుంచి జల్​పల్లి వెళ్లేందుకు దాదాపు 6 కిలో మీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

30 వేల మందిపై ప్రభావం..

జల్​పల్లి చెరువు నిండితే.. దాని ప్రభావం జల్​పల్లిలోని సుమారు 30 వేల జనాభాపై పడుతోంది. జల్​పల్లి శివారు కాలనీలు, గోదాముల్లోకి వరద నీరు వస్తోంది. జల్​పల్లి చెరువు నుంచి పిరంగి నాలా ద్వారా ఇతర చెరువుల్లోకి నీరు వెళ్లి, అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం చెరువు వైపునకు వెళ్తాయి. కానీ పిరంగి నాలా మొత్తం కబ్జాకు గురి కావడం వల్ల నీరు గ్రామంలోకి వస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీరామ్ నగర్ కాలనీ, పి-7 రోడ్డు వైపు కట్ట తెగి లక్ష్మీగూడ, వాంబే కాలనీ ముంపులో చిక్కుకున్నాయి.

ఈ నేపథ్యంలో నాయకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో వల్లే కబ్జాలు ఎక్కువయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కబ్జాలను ఆపాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి.. కబ్జాదారుల కోరల్లో పెద్ద చెరువు.. మోక్షం ఎప్పటికో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.