ETV Bharat / state

తీగలతో సబితా ఇంద్రారెడ్డి భేటీ - chevella

కాంగ్రెస్​ పార్టీ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తెరాస నేత తీగల కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మరికొన్ని రోజుల్లోనే సబితా ఇంద్రారెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. బుధవారం సీఎం కేసీఆర్​తో భేటీ సత్ఫలితాలను ఇచ్చినట్లు సమాచారం.

తీగలతో సబితా ఇంద్రారెడ్డి భేటీ
author img

By

Published : Mar 14, 2019, 1:03 PM IST

తీగలతో సబితా ఇంద్రారెడ్డి భేటీ
గులాబీ పార్టీలో చేరనున్న మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తెరాస నేత తీగల కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సబితా ఇంద్రారెడ్డితో పాటు తనయుడు కార్తీక్ రెడ్డి, ఇతర కాంగ్రెస్​ పార్టీ నాయకులు వెంట వెళ్లారు. తెరాసలో చేరిక, రాబోయే రోజుల్లో ఇరు వర్గాల క్యాడర్​ ఎలా కలిసి ముందుకు సాగాలన్నదానిపై చర్చించారు.

బుధవారం మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తన ముగ్గురు కుమారులతో కలిసి ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​తో భేటీ అయిన విషయం తెలిసిందే. చేవెళ్ల నుంచి కార్తీక్​ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్​ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇవీ చూడండి:కాంగ్రెస్​ అభ్యర్థుల ఎంపికలో తర్జనభర్జనలు

తీగలతో సబితా ఇంద్రారెడ్డి భేటీ
గులాబీ పార్టీలో చేరనున్న మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తెరాస నేత తీగల కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సబితా ఇంద్రారెడ్డితో పాటు తనయుడు కార్తీక్ రెడ్డి, ఇతర కాంగ్రెస్​ పార్టీ నాయకులు వెంట వెళ్లారు. తెరాసలో చేరిక, రాబోయే రోజుల్లో ఇరు వర్గాల క్యాడర్​ ఎలా కలిసి ముందుకు సాగాలన్నదానిపై చర్చించారు.

బుధవారం మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తన ముగ్గురు కుమారులతో కలిసి ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​తో భేటీ అయిన విషయం తెలిసిందే. చేవెళ్ల నుంచి కార్తీక్​ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్​ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇవీ చూడండి:కాంగ్రెస్​ అభ్యర్థుల ఎంపికలో తర్జనభర్జనలు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.