తీగలతో సబితా ఇంద్రారెడ్డి భేటీ గులాబీ పార్టీలో చేరనున్న మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తెరాస నేత తీగల కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సబితా ఇంద్రారెడ్డితో పాటు తనయుడు కార్తీక్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంట వెళ్లారు. తెరాసలో చేరిక, రాబోయే రోజుల్లో ఇరు వర్గాల క్యాడర్ ఎలా కలిసి ముందుకు సాగాలన్నదానిపై చర్చించారు.
బుధవారం మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తన ముగ్గురు కుమారులతో కలిసి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయిన విషయం తెలిసిందే. చేవెళ్ల నుంచి కార్తీక్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇవీ చూడండి:కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో తర్జనభర్జనలు