కరోనా రెండోదశలో అందరి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని లిటిల్ ల్యాంబ్ చర్చి పాస్టర్ సుదర్శన్రావు అన్నారు. మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్నారు. హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలోని 50 మందికి పైగా పాస్టర్లకు 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు.
సామాజిక సేవలో భాగంగానే గత సంవత్సరం లాగానే నిత్యావసరాలు అందిస్తున్నట్లు చర్చి ప్రతినిధులు తెలిపారు. లాక్డౌన్ లేకున్నా ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. త్వరలోనే కొవిడ్ మహమ్మరి ప్రపంచం నుంచి అంతం కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి అధ్యక్షులు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.