ETV Bharat / state

'ప్రపంచానికి భారత్​ ఇచ్చిన గొప్ప బహుమతి... ఆధ్యాత్మికత'

author img

By

Published : Feb 2, 2020, 12:24 PM IST

Updated : Feb 2, 2020, 12:51 PM IST

ఆధ్యాత్మికత... ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతి అని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హాలో శ్రీరామచంద్రమిషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోని అతి పెద్ద ధ్యాన కేంద్రం 'కన్హా శాంతివనాన్ని' ప్రారంభించారు.

president ramnath kovind inaugurated world's largest meditation center  kanha shanthivanam in rangareddy district
'ప్రపంచానికి భారత్​ ఇచ్చిన గొప్ప బహుమతి... ఆధ్యాత్మికత'
'ప్రపంచానికి భారత్​ ఇచ్చిన గొప్ప బహుమతి... ఆధ్యాత్మికత'

శ్రీరామచంద్ర మిషన్​ వ్యక్తిగత మార్పునే కాదు సమాజంలోనూ మార్పు తీసుకొస్తోందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా కన్హాలో ఏర్పాటు చేసిన కన్హా శాంతివనాన్ని ప్రారంభించారు. రామచంద్ర మిషన్​ 75వ వసంతంలో అడుగుపెట్టిన రోజే ఈ కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కోవింద్​ అన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రంగా పేరొందిన ఈ కేంద్రంలో లక్షల మంది అభ్యసిస్తున్నారని రాష్ట్రపతి తెలిపారు. రామచంద్ర మిషన్​కు 150 దేశాల్లో కేంద్రాలు ఉండటం ఆనందంగా ఉందన్నారు. బుద్ధ, మహావీర్​, నానక్, కబీర్​, వివేకానంద వంటి ఆధ్యాత్మిక ప్రతినిధులు చూపిన బాటలో నేటి తరం నడవడం గొప్పవిషయమని పేర్కొన్నారు.

శాంతివనం ఎంతో పవిత్రమైన స్థలమని, ఇక్కడ నాటిన లక్షల మొక్కలు ఆహ్లాదం కలిగిస్తున్నాయని తెలిపారు. దైనందిన జీవితం నుంచి మార్పు కోరుకునే వారికి ఈ కేంద్రం ఉపశమనం ఇస్తుందన్నారు. పరమార్థం, పరోపకారం మనదేశ అంతర్గత వారధులని చెప్పారు.

ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం మన సంస్కృతి అని కోవింద్ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో దాదాజీ సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.

'ప్రపంచానికి భారత్​ ఇచ్చిన గొప్ప బహుమతి... ఆధ్యాత్మికత'

శ్రీరామచంద్ర మిషన్​ వ్యక్తిగత మార్పునే కాదు సమాజంలోనూ మార్పు తీసుకొస్తోందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా కన్హాలో ఏర్పాటు చేసిన కన్హా శాంతివనాన్ని ప్రారంభించారు. రామచంద్ర మిషన్​ 75వ వసంతంలో అడుగుపెట్టిన రోజే ఈ కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కోవింద్​ అన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రంగా పేరొందిన ఈ కేంద్రంలో లక్షల మంది అభ్యసిస్తున్నారని రాష్ట్రపతి తెలిపారు. రామచంద్ర మిషన్​కు 150 దేశాల్లో కేంద్రాలు ఉండటం ఆనందంగా ఉందన్నారు. బుద్ధ, మహావీర్​, నానక్, కబీర్​, వివేకానంద వంటి ఆధ్యాత్మిక ప్రతినిధులు చూపిన బాటలో నేటి తరం నడవడం గొప్పవిషయమని పేర్కొన్నారు.

శాంతివనం ఎంతో పవిత్రమైన స్థలమని, ఇక్కడ నాటిన లక్షల మొక్కలు ఆహ్లాదం కలిగిస్తున్నాయని తెలిపారు. దైనందిన జీవితం నుంచి మార్పు కోరుకునే వారికి ఈ కేంద్రం ఉపశమనం ఇస్తుందన్నారు. పరమార్థం, పరోపకారం మనదేశ అంతర్గత వారధులని చెప్పారు.

ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం మన సంస్కృతి అని కోవింద్ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో దాదాజీ సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.

Last Updated : Feb 2, 2020, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.