ETV Bharat / state

వైశాలి కిడ్నాప్ కేసు.. నవీన్‌రెడ్డిని కస్టడీకి తీసుకున్న పోలీసులు

author img

By

Published : Dec 24, 2022, 10:59 AM IST

Updated : Dec 24, 2022, 2:35 PM IST

Adibatla Kidnap Case Updates
Adibatla Kidnap Case Updates

10:55 December 24

వైశాలి కిడ్నాప్ కేసు.. నవీన్‌రెడ్డిని కస్టడీకి తీసుకున్న పోలీసులు

Adibatla Kidnap Case Updates: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడిని మూడు రోజుల కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే చర్లపల్లి జైలు నుంచి నవీన్​రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కిడ్నాప్ సీన్ రీ-కనస్ట్రక్షన్‌ చేయనున్నారు.

అసలేం జరిగిదంటే: అమెరికా పెళ్లి సంబంధం రావడంతో మన్నెగూడకు చెందిన దంత వైద్యురాలికి ఈ నెల 9న తల్లిదండ్రులు నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు నవీన్​రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం అనుచరులతో పాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పని చేసే 36 మందిని ముందురోజు రాత్రి మన్నెగూడకు రప్పించాడు. నవీన్​రెడ్డి సహా అంతా ఉదయం 11:30 గంటలకు.. మూడుకార్లు, ఓ డీసీఎంలో మన్నెగూడలోని యువతి ఉండే ఇంటికి చేరుకున్నారు.

పథకం ప్రకారం కర్రలు, రాడ్లతో నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్​రెడ్డిని అడ్డుకోబోయిన యువతి తండ్రి, బాబాయ్‌పైనా వారు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి సోఫా, ఫర్నీచర్‌ సహా ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఆ తర్వాత యువతిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన నవీన్ రెడ్డి.. కారులో కూర్చోబెట్టాడు. నవీన్‌ రెడ్డి, రూమెన్, మరో ఇద్దరు కలిసి యువతిని అపహరించుకొని నల్గొండ వైపు పారిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరొకరితో వివాహానికి ఎలా అంగీకరించావని యువతిని కొట్టడంతో.. నుదురు, వీపు, చేతిపై గాయాలయ్యాయి. పోలీసులకు పట్టుబడకుండా మిర్యాలగూడకు వెళ్లే దారిలో.. నవీన్ రెడ్డి, అతని ముగ్గురు స్నేహితులు ఫోన్లు స్విచాఫ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి: ‘పాలమూరు’ ఎన్జీటీ తీర్పుపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

పేదలకు కేంద్రం గుడ్​న్యూస్.. ఏడాది పాటు ఫ్రీ రేషన్

10:55 December 24

వైశాలి కిడ్నాప్ కేసు.. నవీన్‌రెడ్డిని కస్టడీకి తీసుకున్న పోలీసులు

Adibatla Kidnap Case Updates: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడిని మూడు రోజుల కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే చర్లపల్లి జైలు నుంచి నవీన్​రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కిడ్నాప్ సీన్ రీ-కనస్ట్రక్షన్‌ చేయనున్నారు.

అసలేం జరిగిదంటే: అమెరికా పెళ్లి సంబంధం రావడంతో మన్నెగూడకు చెందిన దంత వైద్యురాలికి ఈ నెల 9న తల్లిదండ్రులు నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు నవీన్​రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం అనుచరులతో పాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పని చేసే 36 మందిని ముందురోజు రాత్రి మన్నెగూడకు రప్పించాడు. నవీన్​రెడ్డి సహా అంతా ఉదయం 11:30 గంటలకు.. మూడుకార్లు, ఓ డీసీఎంలో మన్నెగూడలోని యువతి ఉండే ఇంటికి చేరుకున్నారు.

పథకం ప్రకారం కర్రలు, రాడ్లతో నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్​రెడ్డిని అడ్డుకోబోయిన యువతి తండ్రి, బాబాయ్‌పైనా వారు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి సోఫా, ఫర్నీచర్‌ సహా ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఆ తర్వాత యువతిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన నవీన్ రెడ్డి.. కారులో కూర్చోబెట్టాడు. నవీన్‌ రెడ్డి, రూమెన్, మరో ఇద్దరు కలిసి యువతిని అపహరించుకొని నల్గొండ వైపు పారిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరొకరితో వివాహానికి ఎలా అంగీకరించావని యువతిని కొట్టడంతో.. నుదురు, వీపు, చేతిపై గాయాలయ్యాయి. పోలీసులకు పట్టుబడకుండా మిర్యాలగూడకు వెళ్లే దారిలో.. నవీన్ రెడ్డి, అతని ముగ్గురు స్నేహితులు ఫోన్లు స్విచాఫ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి: ‘పాలమూరు’ ఎన్జీటీ తీర్పుపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

పేదలకు కేంద్రం గుడ్​న్యూస్.. ఏడాది పాటు ఫ్రీ రేషన్

Last Updated : Dec 24, 2022, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.