ETV Bharat / state

కరోనా పంజా: గ్రేటర్​లో ఒక్క రోజే 341 మందికి పాజిటివ్

author img

By

Published : Sep 14, 2020, 8:31 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు నమోదవుతున్న కరోనా కేసుల్లో మూడో వంతు గ్రేటర్​ పరిధిలోనే ఉంటున్నాయి. ఆదివారం.. భాగ్యనగరంలో 341 మందికి వైరస్​ సోకింది. రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, హైదరాబాద్ పరిధిలో 699 మందికి కొవిడ్​ పాజిటివ్ నిర్ధరణయ్యింది.

one third of daily corona cases are in hyderabad
కరోనా పంజా: గ్రేటర్​లో ఒక్క రోజే 341 మందికి పాజిటివ్

రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్​ పరిధిలో గత 24 గంటల వ్యవధిలో 341 మంది వైరస్‌ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 210, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 148 మందికి మహమ్మారి సోకింది. రాష్ట్రవ్యాప్త కేసుల్లో మూడోవంతు రాజధానిలోనే నమోదవుతున్నందున ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

వైరస్​ సోకినవారిలో అధికశాతం మందిలో ఎలాంటి లక్షణాలు కన్పించకపోవడం వల్ల... వారు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. లక్షణాలు లేనివారు వ్యాప్తికి కారణమయ్యే ఆస్కారం ఉన్నందున బయట తిరిగేటప్పుడు మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

covid positive cases increasing in hyderabad
వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు

ఇదీ చదవండి: కోలుకున్నా కొన్ని లక్షణాలుంటాయి‌: కేంద్రం

రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్​ పరిధిలో గత 24 గంటల వ్యవధిలో 341 మంది వైరస్‌ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 210, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 148 మందికి మహమ్మారి సోకింది. రాష్ట్రవ్యాప్త కేసుల్లో మూడోవంతు రాజధానిలోనే నమోదవుతున్నందున ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

వైరస్​ సోకినవారిలో అధికశాతం మందిలో ఎలాంటి లక్షణాలు కన్పించకపోవడం వల్ల... వారు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. లక్షణాలు లేనివారు వ్యాప్తికి కారణమయ్యే ఆస్కారం ఉన్నందున బయట తిరిగేటప్పుడు మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

covid positive cases increasing in hyderabad
వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు

ఇదీ చదవండి: కోలుకున్నా కొన్ని లక్షణాలుంటాయి‌: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.