ETV Bharat / state

ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం జాలగూడ గ్రామంలోని గంగోత్రి గోశాలలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో మంత్రులు నిరంజన్​రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. పలువురు రైతులను మంత్రులు సన్మానించారు. నియంత్రిత వ్యవసాయ విధానంతో అన్నదాతలకు లాభం చేకూరుతుందని మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు.

author img

By

Published : Jun 6, 2020, 8:22 PM IST

ministers participated in eruvaka pournami celebrations in rangareddy district
ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు

నియంత్రిత వ్యవసాయం విధానంతో రైతులకు లాభం చేకూరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం జాలగూడ గ్రామంలోని గంగోత్రి గోశాలలో జరిగిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో మంత్రులు నిరంజన్​రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పాల్గొని రైతులను సన్మానించారు. గోశాల నిర్వాహకుడు హనుమంతరావు, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్​ అనితారెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వందల ఆవులను పెంచుతున్న హనుమంతరావును మంత్రులు అభినందించారు. ఆధునిక పోకడలతో పశువులు అంతరించిపోయాయని మంత్రి నిరంజన్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

సాగులో రసాయనిక ఎరువులు వాడటం వల్ల మానవ జీవనం వ్యాధులతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మంత్రి తెలిపారు. ప్రతి ఇంట్లో పశువులు ఉన్నప్పుడు ఆ వ్యక్తులు చెడు దారిలో కాకుండా మంచి దారిలో నడుచుకునే వారని గుర్తు చేశారు. వాటి పోషణ కోసం సమయం వృథా చేయకుండా ఇంటికి వచ్చేవారని పేర్కొన్నారు . ఈ గోశాలలో విద్యాలయం ఏర్పాటు చేసి సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆవుల పెంపకం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భద్రతతో పాటు మానవ జీవనంలో మార్పులు వస్తాయని మంత్రి వెల్లడించారు.

నియంత్రిత వ్యవసాయం విధానంతో రైతులకు లాభం చేకూరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం జాలగూడ గ్రామంలోని గంగోత్రి గోశాలలో జరిగిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో మంత్రులు నిరంజన్​రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పాల్గొని రైతులను సన్మానించారు. గోశాల నిర్వాహకుడు హనుమంతరావు, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్​ అనితారెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వందల ఆవులను పెంచుతున్న హనుమంతరావును మంత్రులు అభినందించారు. ఆధునిక పోకడలతో పశువులు అంతరించిపోయాయని మంత్రి నిరంజన్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

సాగులో రసాయనిక ఎరువులు వాడటం వల్ల మానవ జీవనం వ్యాధులతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మంత్రి తెలిపారు. ప్రతి ఇంట్లో పశువులు ఉన్నప్పుడు ఆ వ్యక్తులు చెడు దారిలో కాకుండా మంచి దారిలో నడుచుకునే వారని గుర్తు చేశారు. వాటి పోషణ కోసం సమయం వృథా చేయకుండా ఇంటికి వచ్చేవారని పేర్కొన్నారు . ఈ గోశాలలో విద్యాలయం ఏర్పాటు చేసి సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆవుల పెంపకం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భద్రతతో పాటు మానవ జీవనంలో మార్పులు వస్తాయని మంత్రి వెల్లడించారు.

ఇవీ చూడండి: అత్యవసర సేవకులకు ఇబ్బంది రానివ్వం: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.