ETV Bharat / state

వరద బాధితులకు ప్రభుత్వ సాయం: మంత్రి సబితా

author img

By

Published : Oct 20, 2020, 7:15 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని ఉస్మాన్​నగర్ ముంపు వరద బాధితులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వం సాయం అందించారు. బాధితులకు రూ.10 వేల నగదు, బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు.

minister sabitha indra reddy distributed government help to flood effected people
minister sabitha indra reddy distributed government help to flood effected people

రాగల రెండు రోజుల్లో భారీ వర్ష సూచన ఉండడం వల్ల లోతట్టు ప్రాంతవాసులు ప్రభుత్వ శిబిరాల్లోకి వెళ్లి సురక్షితంగా ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని ఉస్మాన్​నగర్ ముంపు వరద బాధితులకు మంత్రి ప్రభుత్వం సాయం అందించారు.

షాహీన్​నగర్ ప్రాంతంలోని ఓ ఫంక్షన్​హాల్​లో వరద బాధితులకు మంత్రి రూ.10 వేల నగదు, బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జల్​పల్లి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, కమిషనర్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్లు, తెరాస స్థానిక నేతలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వరద సమస్యకు శాశ్వత పరిష్కారం: మంత్రి సబితా

రాగల రెండు రోజుల్లో భారీ వర్ష సూచన ఉండడం వల్ల లోతట్టు ప్రాంతవాసులు ప్రభుత్వ శిబిరాల్లోకి వెళ్లి సురక్షితంగా ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని ఉస్మాన్​నగర్ ముంపు వరద బాధితులకు మంత్రి ప్రభుత్వం సాయం అందించారు.

షాహీన్​నగర్ ప్రాంతంలోని ఓ ఫంక్షన్​హాల్​లో వరద బాధితులకు మంత్రి రూ.10 వేల నగదు, బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జల్​పల్లి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, కమిషనర్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్లు, తెరాస స్థానిక నేతలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వరద సమస్యకు శాశ్వత పరిష్కారం: మంత్రి సబితా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.