ETV Bharat / state

విపక్షాలు గెలిస్తే అభివృద్ధి దిల్లీలో ఉంటుంది: మంత్రి ఎర్రబెల్లి

author img

By

Published : Nov 25, 2020, 12:50 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్​పేట్​ హౌసింగ్​ బోర్డు డివిజన్​లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు​ పర్యటించారు. కాప్రా సర్కిల్​ 4 వ డివిజన్​లో ఇస్త్రీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థి ప్రభుదాస్​ను గెలిపించాలని ఓటర్లను కోరారు.

minister errabelli campaign in meerpet
విపక్షాలు గెలిస్తే అభివృద్ధి దిల్లీలో ఉంటుంది: మంత్రి ఎర్రబెల్లి

కారు గుర్తుకు ఓటు వేస్తే అభివృద్ధి మన చేతుల్లో ఉంటుందని, లేకపోతే అభివృద్ధి, సంక్షేమం దిల్లీలో ఉంటాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్​పేట్​ హౌసింగ్​ బోర్డులోని కాప్రా సర్కిల్​ 4వ డివిజన్​లో మంత్రి పర్యటించారు. ఇస్త్రీ చేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.

డివిజన్ అభ్యర్థి ప్రభుదాసును భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఎర్రబెల్లి కోరారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యడానికి మాకు మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్​, భాజపాలు నగరాన్ని అభివృద్ధి చేయాలంటే వాళ్లు దిల్లీ నాయకులను అడగాలి.. కానీ తెరాస గెలిస్తే మన గల్లీ నాయకులను అడిగితే సరిపోతుందని మంత్రి స్పష్టం చేశారు.

కారు గుర్తుకు ఓటు వేస్తే అభివృద్ధి మన చేతుల్లో ఉంటుందని, లేకపోతే అభివృద్ధి, సంక్షేమం దిల్లీలో ఉంటాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్​పేట్​ హౌసింగ్​ బోర్డులోని కాప్రా సర్కిల్​ 4వ డివిజన్​లో మంత్రి పర్యటించారు. ఇస్త్రీ చేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.

డివిజన్ అభ్యర్థి ప్రభుదాసును భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఎర్రబెల్లి కోరారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యడానికి మాకు మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్​, భాజపాలు నగరాన్ని అభివృద్ధి చేయాలంటే వాళ్లు దిల్లీ నాయకులను అడగాలి.. కానీ తెరాస గెలిస్తే మన గల్లీ నాయకులను అడిగితే సరిపోతుందని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: గ్రేటర్​ పోరు... బల్దియా ఎన్నికల్లో ఈ ఓటర్లే కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.