ETV Bharat / state

హిమాయత్​నగర్​లో భారీ చోరీ - రూ.2 కోట్ల విలువైన గోల్డ్​ సహా రూ.25 లక్షల నగదు స్వాహా! - MASSIVE THEFT IN BUSINESSMAN HOUSE

నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీ చోరీ - సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు అపహరణ - నిందితుడు సుశీల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Massive Theft In Businessman House
Massive Theft In Businessman House (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2025, 11:31 AM IST

Massive Theft In Businessman House : హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కలకలం రేపింది. సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.25 లక్షల నగదు చోరీకి గురైనట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో నిందితుడు సుశీల్‌ను నాగ్‌పుర్‌ సమీపంలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.

పోలీసుల కథనం ప్రకారం : హిమాయత్‌ నగర్‌లో నివాసం ఉండే వ్యాపారి రోహిత్‌ కేడియా ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా ఫిబ్రవరి 10న దుబాయ్‌కి వెళ్లారు. ఈ క్రమంలోనే దొంగలు ఇంట్లో పడి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. తన యజమాని ఇంట్లో దొంగలు పడ్డారని బుధవారం సాయంత్రం కేడియా మేనేజర్‌ అభయ్‌ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేడియా మేనేజర్​ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్​టీంను రప్పించి ఘటనా స్థలాన్ని క్షణ్నంగా పరిశీలించారు. బీరువాలో దాచి ఉన్న రూ.2 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.25 లక్షల నగదు చోరీకి గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో వేలిముద్రలను కూడా సేకరించారు. ఇది తెలిసిన వారు చేసిన పనే అని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సుశీల్​ అనే వ్యక్తిని నాగ్​పూర్​లో అరెస్టు చేసి హైదరాబాద్​కు తీసుకువచ్చారు.

Massive Theft In Businessman House : హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కలకలం రేపింది. సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.25 లక్షల నగదు చోరీకి గురైనట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో నిందితుడు సుశీల్‌ను నాగ్‌పుర్‌ సమీపంలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.

పోలీసుల కథనం ప్రకారం : హిమాయత్‌ నగర్‌లో నివాసం ఉండే వ్యాపారి రోహిత్‌ కేడియా ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా ఫిబ్రవరి 10న దుబాయ్‌కి వెళ్లారు. ఈ క్రమంలోనే దొంగలు ఇంట్లో పడి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. తన యజమాని ఇంట్లో దొంగలు పడ్డారని బుధవారం సాయంత్రం కేడియా మేనేజర్‌ అభయ్‌ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేడియా మేనేజర్​ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్​టీంను రప్పించి ఘటనా స్థలాన్ని క్షణ్నంగా పరిశీలించారు. బీరువాలో దాచి ఉన్న రూ.2 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.25 లక్షల నగదు చోరీకి గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో వేలిముద్రలను కూడా సేకరించారు. ఇది తెలిసిన వారు చేసిన పనే అని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సుశీల్​ అనే వ్యక్తిని నాగ్​పూర్​లో అరెస్టు చేసి హైదరాబాద్​కు తీసుకువచ్చారు.

పోచారం ఐటీకారిడార్​లో భారీ చోరీ - రూ.2 కోట్లు సహా 28 తులాల బంగారం స్వాహా - Massive Theft in Medchal District

తాళం వేసిన ఇళ్లే ఆదొంగల టార్గెట్ - నగరంలో బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు - Massive theft in Shameerpet

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.