ETV Bharat / state

MLA Sudheer reddy: 'కార్యకర్తలారా... విజయగర్జన సభను విజయవంతం చేద్దాం'

author img

By

Published : Oct 28, 2021, 8:27 AM IST

నిరంతరం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తెరాస ఆవిర్భవించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్​లో జరిగే విజయగర్జన సభకు నియోజకవర్గం నుండి కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు.

MLA Sudheer reddy
MLA Sudheer reddy

కేంద్ర ప్రభుత్వం తరచుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం మత పరమైన ఉద్రిక్తతలు తీసుకొచ్చి మత కలహాలు సృష్టిస్తుందని ఆరోపించారు. ప్రతిఒక్క తెరాస కార్యకర్త భాజపా చేస్తున్న అసత్యపు ప్రచారాలను తిప్పికొట్టాలని నాగోల్‌లో నిర్వహించిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో సూచించారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. నిరంతరం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. తెరాస ఆవిర్భవించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్​లో జరిగే విజయగర్జన సభకు నియోజకవర్గం నుండి కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. దేశంలో అత్యధిక ధాన్యాలు పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. నగరంలో వరదలు వచిన్నప్పుడు ప్రజల ముందుకు వచ్చి నైతిక స్థైర్యంను అందించిన ఘనత తెరాస పార్టీ నాయకులదన్నారు. రాబోయే రోజుల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి రాష్ట్ర స్ధాయిలో చర్చ జరుగుతుందన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్‌లో రిజిస్ట్రేషన్ సమస్యలను తీర్చుతామని పేర్కొన్నారు. వరద నీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గుప్తా సైతం పాల్గొన్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాటిని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరంతరం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీ గుర్తిస్తుంది. ఓపిక పట్టి ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికోసం కృషి చేయండి. పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది. - సుధీర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే

నాగోల్‌లో నిర్వహించిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఇదీ చదవండి:Ktr France tour: డిజిటల్‌ సాంకేతికతలో అద్భుతాలు.. ఫ్రాన్స్, తెలంగాణ పరస్పర సహకారం

కేంద్ర ప్రభుత్వం తరచుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం మత పరమైన ఉద్రిక్తతలు తీసుకొచ్చి మత కలహాలు సృష్టిస్తుందని ఆరోపించారు. ప్రతిఒక్క తెరాస కార్యకర్త భాజపా చేస్తున్న అసత్యపు ప్రచారాలను తిప్పికొట్టాలని నాగోల్‌లో నిర్వహించిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో సూచించారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. నిరంతరం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. తెరాస ఆవిర్భవించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్​లో జరిగే విజయగర్జన సభకు నియోజకవర్గం నుండి కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. దేశంలో అత్యధిక ధాన్యాలు పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. నగరంలో వరదలు వచిన్నప్పుడు ప్రజల ముందుకు వచ్చి నైతిక స్థైర్యంను అందించిన ఘనత తెరాస పార్టీ నాయకులదన్నారు. రాబోయే రోజుల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి రాష్ట్ర స్ధాయిలో చర్చ జరుగుతుందన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్‌లో రిజిస్ట్రేషన్ సమస్యలను తీర్చుతామని పేర్కొన్నారు. వరద నీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గుప్తా సైతం పాల్గొన్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాటిని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరంతరం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీ గుర్తిస్తుంది. ఓపిక పట్టి ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికోసం కృషి చేయండి. పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది. - సుధీర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే

నాగోల్‌లో నిర్వహించిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఇదీ చదవండి:Ktr France tour: డిజిటల్‌ సాంకేతికతలో అద్భుతాలు.. ఫ్రాన్స్, తెలంగాణ పరస్పర సహకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.