ETV Bharat / state

Isolation Center: 'ఐసోలేషన్ సెంటర్​ను సద్వినియోగం చేసుకోవాలి'

author img

By

Published : May 27, 2021, 6:36 PM IST

కరోనా ఐసోలేషన్ సెంటర్(Isolation Center)​ను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) కోరారు. కరోనా బారిన పడిన పేదప్రజలు కొవిడ్ సెంటర్​లో చికిత్స పొందాలని సూచించారు.

isolation center, isolation center in chevella, isolation center in rangareddy district
కరోనా ఐసోలేషన్ సెంటర్, కొవిడ్ ఐసోలేషన్ సెంటర్, చేవెళ్లలో కరోనా ఐసోలేషన్ సెంటర్

కొవిడ్ ఐసోలేషన్ సెంటర్​ను (Isolation Center) పేదప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) కోరారు. చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో పేద ప్రజలకు కరోనా చికిత్స అందించాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న ప్రగతి భవన్​ను 10 పడకల ఉచిత సెంటర్​గా మార్చామని చెప్పారు. కరోనా బారిన పడిన పేద ప్రజలందరూ లక్షలాది రూపాయలు పెట్టి చికిత్స చేసుకోవడం భారంగా మారిన తరుణంలో ఉచితంగా కొవిడ్ సెంటర్​ ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. లాక్​డౌన్ సమయంలో బయటకు రాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.

కొవిడ్ ఐసోలేషన్ సెంటర్​ను (Isolation Center) పేదప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) కోరారు. చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో పేద ప్రజలకు కరోనా చికిత్స అందించాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న ప్రగతి భవన్​ను 10 పడకల ఉచిత సెంటర్​గా మార్చామని చెప్పారు. కరోనా బారిన పడిన పేద ప్రజలందరూ లక్షలాది రూపాయలు పెట్టి చికిత్స చేసుకోవడం భారంగా మారిన తరుణంలో ఉచితంగా కొవిడ్ సెంటర్​ ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. లాక్​డౌన్ సమయంలో బయటకు రాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.