లాక్డౌన్తో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను వివేకానంద సేవా సమితి గుర్తించింది. వారికి సాయం చేయడం కోసం నిత్యావసర సరుకులు అందించాలని నిర్ణయించింది.
శేరిలింగంపల్లి, ఇందిరానగర్లోని వలస కార్మికులకు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల చేతులమీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు రవీందర్, నవీన్, శ్రీధర్ పాల్గొన్నారు.