Eggs Attack On MLA Convoy : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ చౌరస్తా సాగర్ రహదారిపై తెరాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కాన్వాయ్పై ఎన్ఎస్యూఐ నాయుకులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా అడ్డుకున్న ఎన్ఎస్యూఐ నాయకులు దాడికి పాల్పడ్డారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ సమయంలో తమపై దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఎన్ఎస్యూఐ నాయకులు ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినదించారు. నిరసన తెలుపుతున్న ఎన్ఎస్యూఐ నాయకులను తెరాస నేతలు అడ్డగించారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదీ చూడండి: BJP Bheem Deeksha : 'కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలని కేసీఆర్ కుట్ర'