ETV Bharat / state

జల్​పల్లిలో 36 గంటల్లో 50 పడకల కొవిడ్ చికిత్సా కేంద్రం - covid hospital in rangareddy district

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం వల్ల ఆస్పత్రిలో పడకలు సరిపోవడం లేదు. దీనికి పరిష్కారంగా రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని పహాడి షరీఫ్ ప్రాంతంలోని ప్రీమియర్ ఫంక్షన్​ హాల్​లో 50 పడకల సామర్థ్యమున్న తాత్కాలిక కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

covid hospital in jalpally, temporary covid hospital in jalpally
జల్​పల్లి పురపాలిక, జల్​పల్లిలో కొవిడ్ చికిత్సా కేంద్రం,
author img

By

Published : May 3, 2021, 4:32 PM IST

Updated : May 3, 2021, 5:26 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పహాడిషరీఫ్ ప్రాంతంలోని ప్రీమియర్ ఫంక్షన్ హాల్​లో జల్​పల్లి మున్సిపల్ కమిషనర్​ జీపీ కుమార్, పురపాలక సిబ్బంది 36 గంటల్లో 50 పడకల సామర్థ్యమున్న తాత్కాలిక కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అన్ని సదుపాయాలతో కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు జీపీ కుమార్ తెలిపారు.

ఫంక్షన్ హాల్​ ప్రాంగణంలో.. వెయిటింగ్ స్థలం, అత్యవసర పరికరాలు, శానిటేషన్ డెస్క్, కౌన్సిలింగ్ రూమ్, రిజిస్ట్రేషన్ డెస్క్, పోలీస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఉచిత భోజన సదుపాయం కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు. ప్రతి బెడ్​కు ఒక క్యాబిన్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక రూమ్, అన్ని బెడ్స్ క్యాబిన్​ల మధ్య డ్యూటీ డాక్టర్లు, నర్సుల కోసం ప్రత్యేక సదుపాయాలతో ఓ సెక్షన్​ను అందుబాటులోకి తెచ్చారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సహకారంతో దీనిని ఏర్పాటు చేసినట్లు జీపీ కుమార్ చెప్పారు. వైద్యంతో పాటు మందులు, భోజనం ఉచితంగా అందిస్తామని తెలిపారు.

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పహాడిషరీఫ్ ప్రాంతంలోని ప్రీమియర్ ఫంక్షన్ హాల్​లో జల్​పల్లి మున్సిపల్ కమిషనర్​ జీపీ కుమార్, పురపాలక సిబ్బంది 36 గంటల్లో 50 పడకల సామర్థ్యమున్న తాత్కాలిక కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అన్ని సదుపాయాలతో కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు జీపీ కుమార్ తెలిపారు.

ఫంక్షన్ హాల్​ ప్రాంగణంలో.. వెయిటింగ్ స్థలం, అత్యవసర పరికరాలు, శానిటేషన్ డెస్క్, కౌన్సిలింగ్ రూమ్, రిజిస్ట్రేషన్ డెస్క్, పోలీస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఉచిత భోజన సదుపాయం కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు. ప్రతి బెడ్​కు ఒక క్యాబిన్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక రూమ్, అన్ని బెడ్స్ క్యాబిన్​ల మధ్య డ్యూటీ డాక్టర్లు, నర్సుల కోసం ప్రత్యేక సదుపాయాలతో ఓ సెక్షన్​ను అందుబాటులోకి తెచ్చారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సహకారంతో దీనిని ఏర్పాటు చేసినట్లు జీపీ కుమార్ చెప్పారు. వైద్యంతో పాటు మందులు, భోజనం ఉచితంగా అందిస్తామని తెలిపారు.

Last Updated : May 3, 2021, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.